Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్కు మంచి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amid Protests, Apple Wants To Shift Production Out Of Chinag: చైనాలో జీరో కోవిడ్ రూల్స్ అక్కడి ప్రజలనే కాదు.. అక్కడి పరిశ్రమలను కూడా కలవరపరుస్తున్నాయి. కఠినమైన కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. దీంతో చైనా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరేదైన ఆసియా దేశంలో ఆపిల్ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లేదా వియత్నాం దేశాలకు వళ్లే ఆలోచనలో ఉంది.
Read Also: IND Vs BAN: నేడు తొలి వన్డే.. టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది?
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్ టాలరెన్స్’ వల్ల ఆపిల్ కంపెనీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కారణం అవుతోంది. చైనాలో కోవిడ్ రూల్స్ వల్ల జెంగ్జౌ ఐఫోన్ సిటీలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నవంబర్ చివరలో ఫాక్స్కాన్ ఫ్లాంట్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ కర్మాగారంలో నిరసనలు జరగడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ లాక్డౌన్ లో ఉన్న కార్మికులు పారిపోవడం వంటి ఘటనలను జరిగాయి. జెంగ్జౌలో ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో దాదాపుగా 3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ప్రకటించింది. జెంగ్జౌలో ఉన్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ అసెంబ్లీ యూనిట్, చైనా కోవిడ్ నియమాల వల్ల ప్రభావితం అయింది. కఠిన ఆంక్షల కారణంగా తయారీ సామర్థ్యం దెబ్బతింది. దీంతో వీటి సరఫరా ఆలస్యం అయింది.
ఇదిలా ఉంటే ఆపిల్ తయారీ భాగస్వాములు చైనా వెలుపల పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపిస్తుండటంతో ఆపిల్ చైనాను వదిలివేయాలని భావిస్తోంది. కోవిడ్ కఠిన నిబంధనల వల్ల ప్రొడక్షన్ దెబ్బతినడంతో ఆపిల్ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఆసియాలోని భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా.. ఒక్క భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పటిష్టంగా ఉంటుందని పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడించాయి. ఒక వేళ ఆపిల్ కనుక ఇండియాకు వస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బూస్ట్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!