Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్కు మంచి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amid Protests, Apple Wants To Shift Production Out Of Chinag: చైనాలో జీరో కోవిడ్ రూల్స్ అక్కడి ప్రజలనే కాదు.. అక్కడి పరిశ్రమలను కూడా కలవరపరుస్తున్నాయి. కఠినమైన కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. దీంతో చైనా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరేదైన ఆసియా దేశంలో ఆపిల్ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లేదా వియత్నాం దేశాలకు వళ్లే ఆలోచనలో ఉంది.
Read Also: IND Vs BAN: నేడు తొలి వన్డే.. టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది?
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్ టాలరెన్స్’ వల్ల ఆపిల్ కంపెనీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కారణం అవుతోంది. చైనాలో కోవిడ్ రూల్స్ వల్ల జెంగ్జౌ ఐఫోన్ సిటీలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నవంబర్ చివరలో ఫాక్స్కాన్ ఫ్లాంట్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ కర్మాగారంలో నిరసనలు జరగడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ లాక్డౌన్ లో ఉన్న కార్మికులు పారిపోవడం వంటి ఘటనలను జరిగాయి. జెంగ్జౌలో ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో దాదాపుగా 3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ప్రకటించింది. జెంగ్జౌలో ఉన్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ అసెంబ్లీ యూనిట్, చైనా కోవిడ్ నియమాల వల్ల ప్రభావితం అయింది. కఠిన ఆంక్షల కారణంగా తయారీ సామర్థ్యం దెబ్బతింది. దీంతో వీటి సరఫరా ఆలస్యం అయింది.
ఇదిలా ఉంటే ఆపిల్ తయారీ భాగస్వాములు చైనా వెలుపల పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపిస్తుండటంతో ఆపిల్ చైనాను వదిలివేయాలని భావిస్తోంది. కోవిడ్ కఠిన నిబంధనల వల్ల ప్రొడక్షన్ దెబ్బతినడంతో ఆపిల్ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఆసియాలోని భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా.. ఒక్క భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పటిష్టంగా ఉంటుందని పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడించాయి. ఒక వేళ ఆపిల్ కనుక ఇండియాకు వస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బూస్ట్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..