Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్కు మంచి అవకాశం
Amid Protests, Apple Wants To Shift Production Out Of Chinag: చైనాలో జీరో కోవిడ్ రూల్స్ అక్కడి ప్రజలనే కాదు.. అక్కడి పరిశ్రమలను కూడా కలవరపరుస్తున్నాయి. కఠినమైన కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. దీంతో చైనా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరేదైన ఆసియా దేశంలో ఆపిల్ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లేదా వియత్నాం దేశాలకు వళ్లే ఆలోచనలో ఉంది.
Read Also: IND Vs BAN: నేడు తొలి వన్డే.. టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది?
Also Read
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్ టాలరెన్స్’ వల్ల ఆపిల్ కంపెనీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కారణం అవుతోంది. చైనాలో కోవిడ్ రూల్స్ వల్ల జెంగ్జౌ ఐఫోన్ సిటీలో ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నవంబర్ చివరలో ఫాక్స్కాన్ ఫ్లాంట్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ కర్మాగారంలో నిరసనలు జరగడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ లాక్డౌన్ లో ఉన్న కార్మికులు పారిపోవడం వంటి ఘటనలను జరిగాయి. జెంగ్జౌలో ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో దాదాపుగా 3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ప్రకటించింది. జెంగ్జౌలో ఉన్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ అసెంబ్లీ యూనిట్, చైనా కోవిడ్ నియమాల వల్ల ప్రభావితం అయింది. కఠిన ఆంక్షల కారణంగా తయారీ సామర్థ్యం దెబ్బతింది. దీంతో వీటి సరఫరా ఆలస్యం అయింది.
ఇదిలా ఉంటే ఆపిల్ తయారీ భాగస్వాములు చైనా వెలుపల పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపిస్తుండటంతో ఆపిల్ చైనాను వదిలివేయాలని భావిస్తోంది. కోవిడ్ కఠిన నిబంధనల వల్ల ప్రొడక్షన్ దెబ్బతినడంతో ఆపిల్ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఆసియాలోని భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా.. ఒక్క భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే పటిష్టంగా ఉంటుందని పలు ఇంటర్నేషనల్ సంస్థలు వెల్లడించాయి. ఒక వేళ ఆపిల్ కనుక ఇండియాకు వస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బూస్ట్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!