Indian Medicine: చైనాలో భారతీయ మెడిసిన్స్కు భారీ డిమాండ్.. బ్లాక్ మార్కెట్లో కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese turning to Indian drugs on black market amid Covid spike: చైనాలో కోవిడ్-19 విలయతాండవం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో పాటు చాలా చోట్ల మందుల కొరత వేధిస్తోంది. దీంతో చైనీయులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెడిసిన్స్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ లో భారతీయ మందులను కొనుగోలు చేస్తున్నారు.
Read Also: Twitter Down: ట్విట్టర్ డౌన్.. మరోసారి లాగిన్ లో సమస్యలు
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
చైనా కోవిడ్-19 యాంటీ వైరల్ డ్రగ్స్ ను ఆమోదించింది. దీంతో ఫైజర్ కంపెనీ తయారు చేసే పాక్స్లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ హెచ్ఐవీ మందు అజ్వుడిన్ లను ఉపయోగిస్తోంది. ఈ రెండు కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరిమితంగా మందులు లభించడం, ధరలు అధికంగా ఉండటంతో చౌకైన ఇండియన్ మందులకు డిమాండ్ పెరిగింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ జౌషధాలను చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ జనరిక్ ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు.. వీటిని విక్రయిస్తే నేరంగా పరిగణించబడుతుంది.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వీబోలో.. యాంటీ కోవిడ్ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ ఒక్కో బాక్స్ కు 1,000 యువాన్ల చొప్పున అమ్ముతున్నారు’’ వంటి అంశాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. యూజర్లు ఈ మందులు ఎలా పొందాలనే మార్గాలను అణ్వేషిస్తున్నారని అక్కడి సౌత్ చైనా మార్నింగ్ నివేదించింది. భారతదేశానికి సంబంధించిన 4 రకాల ఔషధాలు ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ అక్రమంగా అమ్ముడవుతున్నాయి. చైనా నిపుణులు మాత్రం ఈ మందుల వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వాటిని కొనుగోల చేయవద్దని ప్రజలను కోరుతున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!