Tiktok Ban in Nepal: భారత్ బాటలోనే నేపాల్.. చైనాకు మరో గట్టి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్టాక్కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఆమె పేర్కొన్నారు. అయితే సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ యాప్ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతోనే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ సహా చాలా దేశాలు టిక్టాక్ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేపాల్ చేరడం గమనార్హం. ఎందుకంటే నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read: Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణిని టిక్టాక్ ప్రోత్సహిస్తోందని నేడు జరిగిన కేబినెట్ మీటింగ్లో నేపాల్ ప్రభుత్వం విమర్శించింది. గత నాలుగేళ్లలో నేపాల్లో టిక్టాక్ కారణంగా 1647 సైబర్ నేరాలు నమోదయ్యాయని, నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘సోషల్ నెట్వర్కింగ్ ఆపరేషన్పై దిశలు 2023’ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), టిక్టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లు నేపాల్లో తమ కాంటాక్ట్ కార్యాలయాలను తప్పనిసరిగా తెరవాలి. ఈ విషయమై గురువారం నేపాల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నేపాల్లో కంపెనీల ప్రతినిధులు గైర్హాజరు కావడం వల్ల తమ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం అధికారులకు కష్టమైందనే ఫిర్యాదులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..