Tiktok Ban in Nepal: భారత్ బాటలోనే నేపాల్.. చైనాకు మరో గట్టి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్టాక్కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఆమె పేర్కొన్నారు. అయితే సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ యాప్ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతోనే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ సహా చాలా దేశాలు టిక్టాక్ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేపాల్ చేరడం గమనార్హం. ఎందుకంటే నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read: Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణిని టిక్టాక్ ప్రోత్సహిస్తోందని నేడు జరిగిన కేబినెట్ మీటింగ్లో నేపాల్ ప్రభుత్వం విమర్శించింది. గత నాలుగేళ్లలో నేపాల్లో టిక్టాక్ కారణంగా 1647 సైబర్ నేరాలు నమోదయ్యాయని, నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘సోషల్ నెట్వర్కింగ్ ఆపరేషన్పై దిశలు 2023’ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), టిక్టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లు నేపాల్లో తమ కాంటాక్ట్ కార్యాలయాలను తప్పనిసరిగా తెరవాలి. ఈ విషయమై గురువారం నేపాల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నేపాల్లో కంపెనీల ప్రతినిధులు గైర్హాజరు కావడం వల్ల తమ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం అధికారులకు కష్టమైందనే ఫిర్యాదులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!