Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది. అంగారకుడి రహస్యలను తెలుసుకునేందుకు చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాసా, చైనా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్లు అనేక రోవర్లను అంగారకుడిపైకి పంపాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం సముద్రం, నదులు ఏర్పరిచిన గుర్తులను ఇవి గుర్తించాయి.
ఇదిలా ఉంటే అంగారకుడిపైకి 2021లో చైనా జురాంగ్ అనే రోవర్ ను పంపింది. ప్రస్తుతం ఈ రోవర్ అంగారకుడిపైకి భూమధ్య రేఖ వైపు, ధృవాలకు దూరంగా ఉన్న ఇసుక దిబ్బలపై లిక్విడ్ వాటర్ కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడిపై పెద్ద సముద్రాలు, నదులు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడి అంతర్భాగంలో జరిగిన మార్పులు, ఆ గ్రహంపై అయస్కాంత క్షేత్రాన్ని బలహీన పరచడంతో అక్కడి వాతావరణం, నీరు నెమ్మనెమ్మదిగా విశ్వంలో కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే..భూమధ్య రేఖకు దగ్గరగా తక్కువ అక్షాంశాల వద్ద ద్రవ నీటి ఉనికికి సంబంధించి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు అందించబడలేదు.
Also Read
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
Read Also: Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం
తాజా పరిశోధన ఇప్పుడు మార్స్ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద పురోగతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం జురాంగ్ పంపిన డేటాను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రోవర్ నేరుగా మంచు లేదా మంచు రూపంలోని నీటిని గుర్తించలేదని, బదులుగా పగుళ్లు, క్రస్ట్ లతో ఉప్పు అధికంగా ఉండే దిబ్బలను గుర్తించిందని తెలిపారు. రోవర్ మొదటిసారిగా అంగారకుడి దిబ్బలపై పగిలిన పొరను కనుగొంది. ఇది రెడ్ ప్లానెట్ పై 4,00,000 ఏళ్ల క్రితం ఉప్పు సమృద్ధిగా ఉన్న నీటి ప్రపంచాన్ని సూచిస్తుందని అధ్యయనం తెలిపింది. అంగారకుడిపై ఉష్ణోగ్రతల్లో హెచ్చతగ్గులు మారుతుంటాయి కాబట్టి ఉప్పునీరు ఆవిరై ఉప్పు, కొన్ని ఖనిజలవణాలు మిగిలి ఉంటాయని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.
రోబోటిక్ రోవర్ యొక్క నావిగేషన్ మరియు టెర్రైన్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరా మరియు మార్స్ సర్ఫేస్ కంపోజిషన్ డిటెక్టర్ ద్వారా ఈ డేటాను శాస్త్రవేత్తలు పొందారు. మట్టి దిబ్బల పొరల్లో హైడ్రేటెడ్ సల్ఫేట్లు, హైడ్రేటెడ్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ ఖనిజాలు మరియు బహుశా క్లోరైడ్లు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!