Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ డ్యామ్ భూమి తిరగడాన్ని స్లో చేయడంతో భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
త్రీగోర్జెస్ డ్యామ్లో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ సామర్థ్యం 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్ కేంద్రాలతో దాదాపు సమానం అన్నమాట. ఈ భారీ డ్యామ్తో అన్ని లాభాలే కలుగుతాయని అనుకోవడం పొరపాటే. ఈ డ్యాంలో నీటి నిల్వ దెబ్బకు భూపరిభ్రమణ వేగం తగ్గిపోయింది. రిజర్వాయర్లో నిలిచే నీటి బరువుతో పాటు డ్యామ్ నుంచి 150 మీటర్ల ఎత్తులో విడుదలయ్యే నీటి కారణంగా ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడిందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దీని కారణంగా భూమి పరిభ్రమణ వేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని వారు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు.
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
Monkeypox: అమెరికాలో మంకీపాక్స్ కల్లోలం…7 రాష్ట్రాల్లో గుర్తింపు
అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల భూమి అడుగున ఒత్తిడి పెరిగి తరచూ భూకంపాలు కూడా వస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్యామ్ వల్ల విడుదలయ్యే నీటి కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. పంటలు కూడా తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయి.
గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు ఇనెర్షియా నెలకొని సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!