Business Headlines 15-07-22: ఆల్ ఇన్ వన్ బిజినెస్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్టెల్లో 1.2 శాతం వాటా గూగుల్కి.
ముందుగా ప్రకటించినట్లుగానే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారతీఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను దక్కించుకుంది. ఒక్కో షేరుకు 734 రూపాయల చొప్పున 71 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ మేరకు గూగుల్ 700 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు భారతీఎయిర్టెల్ సెబీకి తెలిపింది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఆర్బీఐ క్రెడిట్, డిపాజిట్ల వెల్లడి
క్రెడిట్ మరియు డిపాజిట్ల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్రెడిట్ 13.29 శాతం పెరగటంతో మొత్తం విలువ 123.81 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. డిపాజిట్లు 9.77 శాతం పెరగటంతో మొత్తం విలువ 169.61 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది.
52 వారాల కనిష్టానికి ఐటీ షేర్లు
ఐటీ షేర్లు నిన్న కూడా నేల చూపులు చేశాయి. నిఫ్టీలో 52 వారాల కనిష్టం కన్నా దిగువకు పడిపోయాయి. ఇంట్రా-డేలో 26,399.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేసుకున్నారు. నిఫ్టీలో ఐటీ షేర్లు ఇంత తక్కువకి ట్రేడ్ అవటం గతేడాది మే నెల తర్వాత ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోనూ ఐటీ షేర్ల వ్యాల్యూ 1.44 శాతం డౌన్ అయింది.
0.4 శాతానికి తగ్గిన చైనా ఆర్థిక వృద్ధి
చైనా ఆర్థిక వృద్ధి గతేడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి 0.4 శాతానికి తగ్గింది. కరోనా లాక్డౌన్ల వల్ల షాంఘై పోర్టులో ఎగుమతులు పడిపోయాయి. షాంఘై పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ అనే సంగతి తెలిసిందే. లాక్డౌన్ల కారణంగా షాంఘైతోపాటు దేశంలోని పెద్ద నగరాల్లో కూడా తయారీ రంగం డీలా పడిపోయింది.
ఇండియాలోకి భారీగా పెట్టుబడులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), అమెరికా మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. యూఏఈ దాదాపు 15,500 కోట్ల రూపాయలు, అమెరికా సుమారు 2,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఐ2యూ2 ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కుల డెవలప్మెంట్ కోసం యూఏఈ ఇన్వెస్ట్ చేస్తుండగా గుజరాత్లోని ద్వారకాలో రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అమెరికా పెట్టుబడి పెట్టనుంది. ఐ2 అంటే.. ఇండియా, ఇజ్రాయెల్. యు2 అంటే యూఏఈ, యూఎస్.
రికార్డు స్థాయికి వాణిజ్య లోటు.
జూన్ నెలలో అంచనాను మించి వాణిజ్య లోటు నెలకొంది. రికార్డ్ స్టాయిలో 26.18 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్, బంగారం, బొగ్గు దిగుమతులూ అదే స్థాయిలో పెరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. దిగుమతులు 57.55 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లకు చేరాయి.
తాజావార్తలు
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..