Brain Eating Amoeba: మెదడును తినే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు
Brain Eating Amoeba First Case Registered In South Korea: అసలే కరోనా కొత్త వేరియెంట్ బీఎఫ్.7 మరోసారి ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈరోజుల్లో.. తాజాగా మరో భయంకరమైన వ్యాధి పుట్టుకొచ్చింది. దాని పేరే ‘నాయ్గ్లేరియా ఫాలెరీ’. దీనిని ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా (మనిషి మెదడు దినే అమీబా) అని కూడా అంటారు. ఆల్రెడీ ఈ వ్యాధి సోకి ఒక వ్యక్తి మరిణించినట్లు.. దక్షిణ కొరియా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 10వ తేదీన థాయ్లాండ్ నుంచి కొరియా వెళ్లిన వ్యక్తి (50).. ఆ మరునాడే ఆసుపత్రిలో చేరాడు. గత మంగళవారం చనిపోయాడని సోమవారం అధికారులు వివరించారు. ఇతడు ఏ వ్యాధితో చనిపోయాడన్న విషయం తేల్చడానికి ఆ వారం రోజుల గ్యాప్ పట్టింది.
Inaya Sultana: సోహెల్కు ఐలవ్యూ చెప్పిన ఇనయా.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా..!!
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
తొలిసారి ఈ అమీబా 1937లో అమెరికాలో వెలుగుచూసింది. ఈ వైరస్ కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా ఈ వైరస్ లోపలికి ప్రవేశించి.. మెదడును తినడం మొదలుపెడుతుంది. ఇది లోనికి ప్రవేశించిన ఐదు రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. తలనొప్పి, తీవ్ర జ్వరం, వికారం, వాంతులు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ మూర్చపోవడం, గందరగోళం, కోమా వంటి తీవ్రమైన లక్షణాలు వస్తాయి. ఇలా లక్షణాలు వచ్చిన ఐదు నుంచి 18 రోజుల్లోపు మరణం సంభవించవచ్చు. 1962 నుంచి 2021 వరకు మొత్తం 154 మంది ఈ వ్యాధి బారిన పడగా.. కేవలం నలుగురు మాత్రమే దీన్నుంచి బతికి బయటపడ్డారు. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువ. అయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Stump Out: టెస్ట్ మ్యాచ్లో అరుదైన సీన్.. 145 ఏళ్ల పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
ఈ వైరస్ నివసించే ప్రాంతాల్లో.. అంటే కొలనులు, కాలువల దగ్గర ప్రజలు అప్రమత్తగా ఉండాల్సిందిగా వైద్య నిపుణులు సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా.. కొలనుల్లో ఈత కొట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదు అవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మందికి ఈ వ్యాధి సోకగా.. 97% మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, భారత్, చైనాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవ్వగా.. ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియాలో తొలి కేసు వెలుగుచూసింది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!