Bangladesh: షేక్ హసీనాను తమకు అప్పగించండి.. భారత్ను కోరిన బంగ్లాదేశ్
- రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని ఆందోళనలు..
- విద్యార్థి సంఘాలను అడ్డుకోవడానికి షేక్ హసీనా కుట్ర చేసింది..
- భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనాను తమకు అప్పగించాలి: బంగ్లాదేశ్
Bangladesh: భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ భారత్ను కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని ఆందోళనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి హసీనాపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ వెల్లడించింది.
Read Also: Kaleshwaram Project: నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టల అఫిడవిట్లపై విచారణ..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
కాగా, ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్పీ వ్యవస్థాపకుడు జియా- ఉర్ రెహమాన్ సమాధి దగ్గర మీర్జా ఫఖ్రుల్ నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలి.. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని అనుకుంటున్నారు.. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవాలి.. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటంతో భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను కలిగి లేదని ఆయన చెప్పుకొచ్చారు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి వెళ్లిపోయింది.. భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రిజైన్ చేసి భారత్ చేరుకుంది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో