BBC Documentary on Modi: మోదీ డాక్యుమెంటరీ వెనక పాకిస్తాన్ వ్యక్తులు ఉన్నారా..? బీబీసీపై బ్రిటన్ ఎంపీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BBC Documentary on Modi: 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు సీరీస్ లను బీబీసీ రూపొందించింది. అయితే ఈ డ్యాక్యుమెంటరీపై భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం బీబీసీ చర్యలను ఖండించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ ఎంపీ ప్రధాని మోదీపై చర్చను లేవనెత్తాడు. అయితే ప్రధాని రిషి సునాక్, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
Read Also: Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ లార్డ్స్ తో సభ్యుడిగా ఉన్న రామి రేంజర్, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని తప్పుపట్టాడు. భారత దేశం జీ-20కి అధ్యక్షత వహిస్తున్న వేళ, యూకేలో భారత సంతతి ప్రధాని ఉన్న సమయంలో, భారత్-యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవికి దీనిపై లేఖ రాశారు. యూకే నగరాల్లో హిందువుల, ముస్లిం మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి..దీన్ని పెంచే విధంగా డాక్యుమెంటరీలోని రెండో భాగం ఉందని, దాన్ని నిలిపివేయాలని బీబీసీని కోరాడు.
ఈ డాక్యుమెంటరీ చాలా దుర్మార్గంగా ఉందని విమర్శించారు. బీబీసీలో పాకిస్తాన్ మూలాలకు చెందిన సిబ్బంది ఈ అర్థం లేని పనివెనక ఉన్నారా..? అని రామి రేంజర్ ప్రశ్నించారు. ఈ డాక్యుమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాన మంత్రిని, భారతదేశ న్యాయవ్యవస్థను అవమానపరిచిందని అన్నారు. ఈ డాక్యుమెంటరీని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని.. హింస, ప్రాణనష్టం ఎక్కడ జరిగినా.. ఖండిస్తున్నానని.. భారతదేశంలోని రాజకీయాలను ప్రపంచానికి తీసుకురావడం ద్వారా యూకేలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను హింసించే దేశంగా భారత్ ను చిత్రీకరించడానికి, పాత గాయాలను తెరిచిందని అన్నారు. ఇదే నిజం అయితే ముస్లింలు ఈ పాటికి భారతదేశాన్ని వదిలివెళ్లేవారని, కానీ భారత్ ముస్లిం జనాభా పాకిస్తాన్ కన్నా ఎక్కువ అని గుర్తిచేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!