Bangladesh: ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు హిందువు ఇళ్లు దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu man’s home set on fire in Bangladesh: బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది మతోన్మాదులు హిందువుల పండగల సందర్భంలో, ఉత్సవాల సందర్భంలో గుడులపై దాడులు చేయడం, హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా బంగ్లాదేశ్ లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఇస్లాంను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ..బంగ్లాదేశ్ లోని నరైల్ లోని లోహగరాలోని హిందు వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టడమే కాకుండా.. దేవాలయానికి దుండగులు శుక్రవారం నిప్పు పెట్టారు. ఈ ఘటనల తరువాత అల్లరి మూక రాళ్లు రువ్వింది. స్థానికంగా ఉండే డిఘోలియా గ్రామంలో కూడా అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు గ్రామంలో అనేక ఇళ్లను ధ్వంసం చేశారు.. ఇళ్లను కాల్చేందుకు ప్రయత్నించారు. అయితే అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
Read Also: Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ముస్లింలు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే పోస్ట్ పెట్టిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువకుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయనట్లుగా తెలుస్తోంది. నారైల్ ఎస్పీ ప్రబీర్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులో ఉందని.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తిని స్థానిక హిందూ యువకుడు సహపరా ప్రాంతానికి చెందిన అశోఖ్ సాహా కుమారుడు ఆకాష్ సాహాగా గుర్తించారు. శుక్రవారం జుమా ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈ హింస చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్ లో మతపరంగా మైనారిటీలు అయిన హిందువులపై తరుచుగా దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల కన్నా వదంతుల వల్లే ఎక్కువగా దాడులు జరుగుతన్నాయి. ఓ నివేదిక ప్రకారం జనవరి 2013 మరియు సెప్టెంబర్ 2021 మధ్య బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై 3,679 దాడులు జరిగాయి.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!