Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో మాంసం ముక్కలు పడేయడంతో వివాదం రాజుకుంది. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవాలయాన్ని అపవిత్రం చేశారని.. ఆరోపిస్తూ ఓ వర్గం వారు ఆందోళన చేశారు.
యూపీ కన్నౌజ్ జిల్లా రసూలాబాద్ గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలంయ ప్రాంగణంలో మాంసం ముక్కలను విసిరేశారు. అంతే కాకుండా రెండు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటన ఘర్షణలకు కారణం అయింది. అయితే ఈ ఘటనపై ఆలయ పూజారీ జగదీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దేవాలయాన్ని శుభ్రం చేయించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మౌనంగా ఉన్నారని బాధిత వర్గం నిరసన కార్యక్రమాలు చేసింది. తల్గ్రామ్- ఇందర్ ఘర్ రహదారిని దిగ్భందించారు.
Also Read
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
Read Also: Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
మూడు గంటల పాలు దిగ్భంధనం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఈ ఆందోళలు జరిగిన తర్వాత రెండు చోట్ల విగ్రహాలను ధ్వంస చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు నాలుగు దుకాణాలను తగలబెట్టారు. స్మశాన వాటికను ధ్వంసం చేశారు. దీంతో జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. శనివారం సాయంత్రం కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ , కాన్పూర్ కమిషనర్ రాజ్ శేఖర్ తాల్గ్రామ్ చేరుకుని.. విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!