Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో మాంసం ముక్కలు పడేయడంతో వివాదం రాజుకుంది. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవాలయాన్ని అపవిత్రం చేశారని.. ఆరోపిస్తూ ఓ వర్గం వారు ఆందోళన చేశారు.
యూపీ కన్నౌజ్ జిల్లా రసూలాబాద్ గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలంయ ప్రాంగణంలో మాంసం ముక్కలను విసిరేశారు. అంతే కాకుండా రెండు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటన ఘర్షణలకు కారణం అయింది. అయితే ఈ ఘటనపై ఆలయ పూజారీ జగదీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దేవాలయాన్ని శుభ్రం చేయించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మౌనంగా ఉన్నారని బాధిత వర్గం నిరసన కార్యక్రమాలు చేసింది. తల్గ్రామ్- ఇందర్ ఘర్ రహదారిని దిగ్భందించారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
మూడు గంటల పాలు దిగ్భంధనం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఈ ఆందోళలు జరిగిన తర్వాత రెండు చోట్ల విగ్రహాలను ధ్వంస చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు నాలుగు దుకాణాలను తగలబెట్టారు. స్మశాన వాటికను ధ్వంసం చేశారు. దీంతో జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. శనివారం సాయంత్రం కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ , కాన్పూర్ కమిషనర్ రాజ్ శేఖర్ తాల్గ్రామ్ చేరుకుని.. విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!