Uttar Pradesh: దేవాలయంలో మాంసం ముక్కలు.. కన్నౌజ్ లో మతఘర్షణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో మాంసం ముక్కలు పడేయడంతో వివాదం రాజుకుంది. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. దేవాలయాన్ని అపవిత్రం చేశారని.. ఆరోపిస్తూ ఓ వర్గం వారు ఆందోళన చేశారు.
యూపీ కన్నౌజ్ జిల్లా రసూలాబాద్ గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలంయ ప్రాంగణంలో మాంసం ముక్కలను విసిరేశారు. అంతే కాకుండా రెండు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటన ఘర్షణలకు కారణం అయింది. అయితే ఈ ఘటనపై ఆలయ పూజారీ జగదీష్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దేవాలయాన్ని శుభ్రం చేయించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మౌనంగా ఉన్నారని బాధిత వర్గం నిరసన కార్యక్రమాలు చేసింది. తల్గ్రామ్- ఇందర్ ఘర్ రహదారిని దిగ్భందించారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
మూడు గంటల పాలు దిగ్భంధనం కొనసాగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు శాంతింపచేశారు. ఈ ఆందోళలు జరిగిన తర్వాత రెండు చోట్ల విగ్రహాలను ధ్వంస చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు నాలుగు దుకాణాలను తగలబెట్టారు. స్మశాన వాటికను ధ్వంసం చేశారు. దీంతో జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. శనివారం సాయంత్రం కాన్పూర్ ఐజీ ప్రశాంత్ కుమార్ , కాన్పూర్ కమిషనర్ రాజ్ శేఖర్ తాల్గ్రామ్ చేరుకుని.. విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!