బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.