Pakistan: బలూచిస్తాన్లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..
- బలూచిస్తాన్లో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
- వరస దాడులతో విరుచుకుపడుతున్న తిరుగుబాటుదారులు..
- కీలకమైన మంగోచార్ పట్టణం బీఎల్ఏ వశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో ఆ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ విరుచుకుపడుతోంది. నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వ అధికారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బీఎల్ఏ యోధులదే అధికారం. ఇప్పుడు, ఆ కొద్ది అధికారం కూడా పాక్ చేజారిపోతోంది.
Read Also: Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్ఏ యోధులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం మొత్తం పాకిస్తాన్కి బీఎల్ఏ చుక్కలు చూపించింది.
మరోవైపు ప్రావిన్సు రాజధాని క్వెట్టాను కరాచీని కలిపే హైవేని తిరుగుబాటుదారులు దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టుల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. పాకిస్తాన్ దళాలు వచ్చే సమయానికి మొత్తం విధ్వంసం సృష్టించారు. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ శిబిరంపై కూడా దాడి చేశారు. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగోచార్ని బీఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్పోస్టుపైమ కాల్పులు జరిగాయి. దీంట్లో ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఒక వంతెన కింద బాంబు పేలింది.
BIG BREAKING:
Baloch freedom fighters have reportedly taken control of Mangocher city in Kalat district, seizing government buildings and military installations.
Hundreds of armed men are involved, and intense clashes continue after an attack on the main Pakistani Army camp. pic.twitter.com/qCFUJJJCDp
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 2, 2025
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!