Pakistan: బలూచిస్తాన్లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..
- బలూచిస్తాన్లో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
- వరస దాడులతో విరుచుకుపడుతున్న తిరుగుబాటుదారులు..
- కీలకమైన మంగోచార్ పట్టణం బీఎల్ఏ వశం..
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది. ఇప్పటికే, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా, బలూచ్ ప్రాంతంలోని ఆర్మీని ఎల్ఓసీ, భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో ఆ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ విరుచుకుపడుతోంది. నిజానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వ అధికారం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో బీఎల్ఏ యోధులదే అధికారం. ఇప్పుడు, ఆ కొద్ది అధికారం కూడా పాక్ చేజారిపోతోంది.
Read Also: Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?
Also Read
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్ఏ యోధులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం మొత్తం పాకిస్తాన్కి బీఎల్ఏ చుక్కలు చూపించింది.
మరోవైపు ప్రావిన్సు రాజధాని క్వెట్టాను కరాచీని కలిపే హైవేని తిరుగుబాటుదారులు దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టుల్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. పాకిస్తాన్ దళాలు వచ్చే సమయానికి మొత్తం విధ్వంసం సృష్టించారు. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ శిబిరంపై కూడా దాడి చేశారు. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగోచార్ని బీఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్పోస్టుపైమ కాల్పులు జరిగాయి. దీంట్లో ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఒక వంతెన కింద బాంబు పేలింది.
BIG BREAKING:
Baloch freedom fighters have reportedly taken control of Mangocher city in Kalat district, seizing government buildings and military installations.
Hundreds of armed men are involved, and intense clashes continue after an attack on the main Pakistani Army camp. pic.twitter.com/qCFUJJJCDp
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 2, 2025
తాజావార్తలు
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!