US-Israel: ఖతార్లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా! వెలుగులోకి కీలక రిపోర్ట్!
- ఖతార్లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా!
- వెలుగులోకి కీలక రిపోర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖతార్లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే హమాస్ అగ్ర నాయకులంతా తప్పించుకోగా.. బంధువులు, ఒక ఖతార్ అధికారి మాత్రం బలైపోయారు. అయితే ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును ఖండించాయి. ఖతార్కు మద్దతుగా నిలిచాయి.

Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఇక ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ ఖతార్పై ఇజ్రాయెల్ దాడి విషయం తనకు తెలియదని.. దీని వెనుక తన ఆదేశాలు లేవని.. పూర్తిగా నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఖతార్ తమ మిత్ర దేశమని.. ఇకపై ఏ దాడి జరగబోదని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు
అయితే అమెరికా వాదనను ఒక జర్నలిస్ట్ తోసిపుచ్చారు. ఖతార్లోని దోహా దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని వాదించారు. ఖతార్లోని హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి గంట ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ట్రంప్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని.. కనీసం ముగ్గురు సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయం తనతో చెప్పారని ఆక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవిద్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…
క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత కాదు.. గాల్లోకి ఎగరక ముందే.. అనగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రంప్కు సమాచారం అందించినట్లుగా ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నాడు. వాస్తవంగా ఉదయం 7:45 గంటలకే ట్రంప్కు నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని వివరించాడు. అయితే తనతో నాల్గో అధికారి కూడా తనతో మాట్లాడాడని.. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించినట్లు పేర్కొ్న్నాడు. ఉదయం 7:45కే ట్రంప్కు కాల్ వెళ్లిందని ఆయన చెప్పినట్లుగా వివరించాడు.
ఇటీవల ట్రంప్ను ఇదే విషయాన్ని విలేకరి మరోసారి ప్రశ్నించగా దాడి గురించి ముందు చెప్పలేదని.. దాడి తర్వాత చెప్పరని చెప్పుకొచ్చారు. దీంతో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. విషయం చెప్పే సమయానికే క్షిపణులు గాల్లోకి ఎగిరిపోయాయని.. ఆ తర్వాతే వైట్హౌస్కు సమాచారం వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రిపోర్టర్ చెప్పేదానికి-ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!