US-Israel: ఖతార్లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా! వెలుగులోకి కీలక రిపోర్ట్!
- ఖతార్లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా!
- వెలుగులోకి కీలక రిపోర్ట్!
ఖతార్లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే హమాస్ అగ్ర నాయకులంతా తప్పించుకోగా.. బంధువులు, ఒక ఖతార్ అధికారి మాత్రం బలైపోయారు. అయితే ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును ఖండించాయి. ఖతార్కు మద్దతుగా నిలిచాయి.

Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ఇక ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ ఖతార్పై ఇజ్రాయెల్ దాడి విషయం తనకు తెలియదని.. దీని వెనుక తన ఆదేశాలు లేవని.. పూర్తిగా నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఖతార్ తమ మిత్ర దేశమని.. ఇకపై ఏ దాడి జరగబోదని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు
అయితే అమెరికా వాదనను ఒక జర్నలిస్ట్ తోసిపుచ్చారు. ఖతార్లోని దోహా దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని వాదించారు. ఖతార్లోని హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి గంట ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ట్రంప్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని.. కనీసం ముగ్గురు సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయం తనతో చెప్పారని ఆక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవిద్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…
క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత కాదు.. గాల్లోకి ఎగరక ముందే.. అనగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రంప్కు సమాచారం అందించినట్లుగా ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నాడు. వాస్తవంగా ఉదయం 7:45 గంటలకే ట్రంప్కు నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని వివరించాడు. అయితే తనతో నాల్గో అధికారి కూడా తనతో మాట్లాడాడని.. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించినట్లు పేర్కొ్న్నాడు. ఉదయం 7:45కే ట్రంప్కు కాల్ వెళ్లిందని ఆయన చెప్పినట్లుగా వివరించాడు.
ఇటీవల ట్రంప్ను ఇదే విషయాన్ని విలేకరి మరోసారి ప్రశ్నించగా దాడి గురించి ముందు చెప్పలేదని.. దాడి తర్వాత చెప్పరని చెప్పుకొచ్చారు. దీంతో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. విషయం చెప్పే సమయానికే క్షిపణులు గాల్లోకి ఎగిరిపోయాయని.. ఆ తర్వాతే వైట్హౌస్కు సమాచారం వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రిపోర్టర్ చెప్పేదానికి-ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో