Bangladesh: “బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..
- బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు షేక్ హసీనా పార్టీనే కారణం..
- దాడులు రాజకీయపరమైనవి.. మతపరమైనవి కాదు..
- అవామీ లీగ్కి మద్దతు ఇచ్చారనే దాడులు..
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి. హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్లు జరిగాయి. హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు. చివరకు, భారత ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని అడ్డు్కోవాలని కోరడంతో దాడులు తగ్గాయి.
ఇదిలా ఉంటే, ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు. హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని, రాజకీయ పరమైనవని పేర్కొన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కి హిందువులు మద్దతిచ్చారనే అభిప్రాయం ఉన్నందునే, రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్లు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా చెప్పాను. ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది. హసీనా, అవామీలీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు, వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయి’’ అని చెప్పారు.
Also Read
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
- Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్
‘‘అవామీ లీగ్ కార్యకర్తల్ని కొట్టేటప్పుడు, బంగ్లాదేశ్ హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులనే అభిప్రాయంతో వారిపై దాడులు జరిగాయి. జరిగినవి సరైనవని నేను అనడం లేదు కానీ..కొందరు దాన్ని సాకుగా చూపి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి, అవామీ లీగ్, హిందువుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు’’ అని చెప్పారు. తాను న్యూఢిల్లీలో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత మరియు ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత మద్దతుని తెలియజేశారని చెప్పారు.
1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో 22 శాతం ఉన్న హిందువులు, ఇప్పుడు 170 మిలియన్లలో 8 శాతం ఉన్నారు. ప్రధానంగా లౌకిక వైఖరి అవలంభిస్తుందని అవామీ లీగ్కి మద్దతు ఇస్తున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు గురించి చర్చిస్తూ, యూనస్ భారతదేశంతో మంచి సంబంధాల కోసం కోరికను వ్యక్తం చేశాడు, అయితే షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్గా మారుతుందనే కథనాన్ని న్యూఢిల్లీ తప్పక విరమించుకోవాలని పట్టుబట్టారు.
తాజావార్తలు
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!