Bangladesh: “బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు అదే కారణం”: మహ్మద్ యూనస్..
- బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు షేక్ హసీనా పార్టీనే కారణం..
- దాడులు రాజకీయపరమైనవి.. మతపరమైనవి కాదు..
- అవామీ లీగ్కి మద్దతు ఇచ్చారనే దాడులు..
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి. హిందూ యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్లు జరిగాయి. హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు. చివరకు, భారత ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని అడ్డు్కోవాలని కోరడంతో దాడులు తగ్గాయి.
ఇదిలా ఉంటే, ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు. హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని, రాజకీయ పరమైనవని పేర్కొన్నారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కి హిందువులు మద్దతిచ్చారనే అభిప్రాయం ఉన్నందునే, రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్లు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా చెప్పాను. ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది. హసీనా, అవామీలీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటుని ఎదుర్కొన్నప్పుడు, వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయి’’ అని చెప్పారు.
Also Read
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్
‘‘అవామీ లీగ్ కార్యకర్తల్ని కొట్టేటప్పుడు, బంగ్లాదేశ్ హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులనే అభిప్రాయంతో వారిపై దాడులు జరిగాయి. జరిగినవి సరైనవని నేను అనడం లేదు కానీ..కొందరు దాన్ని సాకుగా చూపి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి, అవామీ లీగ్, హిందువుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు’’ అని చెప్పారు. తాను న్యూఢిల్లీలో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని, ప్రధాని మోడీ ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత మరియు ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత మద్దతుని తెలియజేశారని చెప్పారు.
1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో 22 శాతం ఉన్న హిందువులు, ఇప్పుడు 170 మిలియన్లలో 8 శాతం ఉన్నారు. ప్రధానంగా లౌకిక వైఖరి అవలంభిస్తుందని అవామీ లీగ్కి మద్దతు ఇస్తున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు గురించి చర్చిస్తూ, యూనస్ భారతదేశంతో మంచి సంబంధాల కోసం కోరికను వ్యక్తం చేశాడు, అయితే షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్గా మారుతుందనే కథనాన్ని న్యూఢిల్లీ తప్పక విరమించుకోవాలని పట్టుబట్టారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!