Hajj Pilgrims: నిప్పుల కొలిమిలా “హజ్ యాత్ర”.. 68 మంది భారతీయులతో పాటు 1000కి పైగా మృతి..
- హజ్ యాత్రలో పెరుగుతున్న మరణాలు..
- 68 మంది భారతీయులతో సహా 1000 దాటిని మృతుల సంఖ్య..
- వేడి తీవ్రతతో అల్లాడుతున్న యాత్రికులు..
- ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన మరణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hajj Pilgrims: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ‘‘హజ్ యాత్ర’’ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. దారుణమైన వేడి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 68 మంది భారతీయులతో పాటు కనీసం 1000 మంది వరకు వేడి కారణంగా మరణించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. గురువారం కొత్తగా నమోదైన మరణాల్లో ఈజిప్ట్ దేశానికి చెందిన 58 మంది ఉన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన వారిలో మరణించిన వారి సంఖ్య 1000ని దాటింది. ఈజిప్టు నుంచే ఎక్కువ మంది మరణించిన వారు ఉన్నారు. ఈ ఒక్క దేశం నుంచే 658 మంది మరణించారు. మరణించిన 630 మందిని గుర్తించాల్సి ఉంది.
Read Also: UGC-NET: యూజీసీ-నెట్ పునఃపరీక్షపై కేంద్ర విద్యాశాఖ కీలక సమాచారం..
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
ఇండియా నుంచి యాత్రకు వెళ్లిన వారిలో 68 మంది మరణించినట్లు సౌదీ దౌత్యవేత్తలు చెప్పారు. వేడి కారణంగానే మరణాలు చోటు చేసుకుంటున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు ధృవీకరించారు. గతేడాది 200 మందికి పైగా యాత్రికులు మరణించారు. సౌదీ అరేబియాలో ఆదివారం రోజు 2700 కంటే ఎక్కువ వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రతీ ఏడాది కూడా మరణాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం అనూహ్యంగా మరణాల సంఖ్య 1000ని దాటింది. హజ్ యాత్రకు కేంద్రంగా ఉన్న మక్కాలో ప్రతీ దశాబ్ధం ఉష్ణోగ్రత 0.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..