Turkey Earthquake: టర్కీకి సాయం చేసిన ఆర్మేనియా.. ఈ సాయం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: టర్కీ దేశం భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతింది. టర్కీలోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియా కూడా దెబ్బతింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో మరణాల సంఖ్య 24 వేలను దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా నష్టపోయిన టర్కీకి ప్రపంచదేశాల నుంచి ఆపన్నహస్తం అందుతోంది. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో రెస్క్యూ ఆపరేషన్, వైద్య సహాయం అందిస్తోంది. ఇతర ప్రపంచదేశాలు కూడా తగినంత సహాయం చేస్తున్నాయి.
Read Also: Pakistan: దైవదూషణ పేరుతో హత్య.. పోలీసుల ముందే ఘటన..
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ఇదిలా ఉంటే ఆర్మేనియా, టర్కీకి సహాయాన్ని పంపింది. ఇది ఎందుకంత ప్రత్యేకం అంటే పాకిస్తాన్, భారత్ లాగే ఈ రెండు దేశాలు కూడా బద్ధ శత్రువులు. టర్కీ, ఆర్మేనియాల శతృత్వం అంతకన్నా ఎక్కువనే చెప్పాలి. గత 35 ఏళ్లుగా ఈ రెండు దేశాల సరిహద్దులు మూసే ఉన్నాయి. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇరు దేశాల మధ్య సరిహద్దు మళ్లీ ప్రారంభం అయింది. ఆహారంతో కూడిన ఐదు ట్రక్కులు ఆర్మేనియా నుంచి టర్కీకి చేరుకున్నాయి. 1988 తర్వాత ఇప్పుడే తొలిసారిగా సరిహద్దులను తెరిచారు. ఆహారంతో పాటు మెడిసిన్స్ ను ఆర్మేనియా, టర్కీకి పంపింది. సాయం చేసినందుకు టర్కీ ప్రత్యేక రాయబారి సెర్దార్ కిలిక్, ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రూబెన్ రూబినియన్ కు ట్వీట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం కాలంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్మేనియన్లను సామూహికంగా హత్యలు చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 డిసెంబర్ లో నగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆర్మేనియాకు వ్యతిరేకంగా అజర్ బైజాన్ కు టర్కీ మద్దతు ఇచ్చింది, అత్యాధుని ఆయుధాలు ఇవ్వడం ద్వారా అజర్ బైజాన్, ఆర్మేనియాపై గెలిచింది. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనేందుకు ప్రత్యేక రాయబారులను నియమించుకున్నాయి. రెండేళ్ల తరువాత టర్కీ, ఆర్మేనియా 2022 ఫిబ్రవరిలో తొలి వాణిజ్య విమానాల సర్వీసులను తిరిగి ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు వివాదం వల్ల 1993 నుంచి భూ సరిహద్దు మూసివేశారు.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!