Myanmar: చైనా సరిహద్దుని స్వాధీనం చేసుకున్న సాయుధ మయన్మార్ గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు చాలా కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రం అంతటా ఘర్షణలు చెలరేగాయి.
సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న సాయుధ గ్రూపులు సైనిక స్థావరాలు, చైనాతో వాణిజ్యానికి ముఖ్యమైన పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నగదు కొరత ఉన్న జుంటా ప్రభుత్వానికి చైనా నుంచి సాయం డబ్బు అందకుండా వాణిజ్య మార్గాలను మూసేశాయి. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ (MNDAA) కైన్ శాన్ క్యావ్ట్ సరిహద్దు గేటును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా చెప్పింది. ఈ గ్రూపుతో అరకాన్ ఆర్మీ (AA) మరియు తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA)తో మిత్రుత్వ ఉంది. సరిహద్దు వద్ద ఎంఎన్డీఏఏ తన జెండాను ఏగరేసింది.
Also Read
- Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
- Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
- Sundar Pichai Booed at Stanford: సుందర్ పిచాయ్కి షాక్.. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్!
Read Also: China: చైనాలో ప్రబలుతున్న “మిస్టరీ వ్యాధి”.. కారణాలు ఇవే అంటున్న ఆ దేశ అధికారులు..
ప్రస్తుతం ఆక్రమించుకున్న సరిహద్దు మయన్మార్-చైనా వాణిజ్యానికి అత్యంత కీలకంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో సరిహద్దు క్రాసింగ్ వద్ద ఆపి ఉన్న 120 ట్రక్కుల్లో మంటలు చెలరేగాయి, దీనికి సాయుధ సమూహాలే కారణమని జుంటా ప్రభుత్వ ప్రతినిధి జా మిన్ తున్ ఆరోపించారు. సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడ సాయుధ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.
ఇదిలా ఉంటే చైనా, మయన్మార్ సైన్యానికి మద్దతు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చైనా-మయన్మార్ సంయుక్తంగా సరిహద్దు వద్ద సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. యువాన్ ప్రావిన్స్లో నవంబర్ 28 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయని చైనా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మయన్మార్ అల్లర్ల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అక్కడి నివసిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే తిరుగుబాటుని అణిచివేయడానికి మయన్మార్ ఆర్మీ ప్రజల్ని చంపుతోంది. అక్కడి నుంచి మనదేశంలోని మిజోరాం రాష్ట్రానికి ప్రజలు వలస వస్తున్నారు.
- Tags
- china
- india
- junta Ruling
- Myanmar
తాజావార్తలు
-
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
-
Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
ట్రెండింగ్
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!