China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్కు ముప్పు ఎంత?
- చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v
- భారత్లో ఆందోళన అవసరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో తొలిసారిగా మనిషిలో స్వైన్ ఇన్ఫ్లుయెంజా A(H1N2)v వైరస్ సోకిన కేసు నమోదైనట్లు సమాచారం. దీంతో జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ ఒక్క కేసు కారణంగా భారత్లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఈ వైరస్ సోకిన వ్యక్తి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 2 సంవత్సరాల 10 నెలల బాలుడు. అతడికి పదేపదే జ్వరం రావడంతో పాటు అకస్మాత్తుగా తీవ్రమయ్యే దగ్గు వచ్చింది.
బాలుడి పరిస్థితి ఎలా ఉంది?
బాలుడికి పలుమార్లు వైద్య చికిత్స అందించినప్పటికీ జ్వరం, దగ్గు తగ్గలేదు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో ఇన్ఫ్లుయెంజా A వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో కఫం పరీక్షలో Haemophilus influenzae అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్లు తేలింది. ఛాతీ CT స్కాన్లో ఊపిరితిత్తుల్లోని గుర్తులు పెరగడంతో పాటు కొంత అస్పష్టంగా కనిపించినట్లు వైద్యులు తెలిపారు. బాలుడికి cefoperazone-sulbactam, oseltamivir, ambroxol, nebulised budesonide వంటి చికిత్సలు అందించారు. అనంతరం జ్వరం తగ్గడంతో పాటు శ్వాస సంబంధిత లక్షణాలు కూడా మెరుగుపడ్డాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత బాలుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Also Read
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
భారతీయులు భయపడాలా?
న్యూఢిల్లీలోని ఆస్తా హాస్పిటల్కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ ప్రదీక్ కడియన్ ఈ కేసుపై స్పందించారు. స్వైన్ మూలానికి చెందిన ఇన్ఫ్లుయెంజా వైరస్ మనిషిలో గుర్తించడం పర్యవేక్షించాల్సిన విషయమే అయినప్పటికీ, భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి వైరస్లు సాధారణంగా పందుల్లో వ్యాప్తి చెందుతాయి. అప్పుడప్పుడు మాత్రమే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అధికారులు పరిశీలించాల్సిన అంశం వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి ఎంత సమర్థవంతంగా వ్యాపించగలదన్నదేనని డాక్టర్ కడియన్ తెలిపారు.
సాధారణ ప్రజలకు తక్షణ ప్రమాదం తక్కువ
పందులతో క్రమం తప్పకుండా సంబంధం లేని సాధారణ ప్రజలకు తక్షణ ప్రమాదం సాధారణంగా తక్కువగానే ఉంటుందని వైద్యుడు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లుయెంజా వైరస్లు కాలక్రమేణా మార్పులకు లోనయ్యే అవకాశం ఉన్నందున భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క మనిషిలో వైరస్ గుర్తించడం వల్ల వెంటనే వ్యాధి వ్యాప్తి లేదా మహమ్మారి ప్రారంభమైందని అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు. అసాధారణ ఇన్ఫ్లుయెంజా కేసులను నిరంతరం పర్యవేక్షించడం, వాటిని సకాలంలో గుర్తించి అధికారులకు నివేదించడం ముఖ్యమని చెప్పారు.
పందులతో సంబంధం ఉన్నవారు ఈ లక్షణాలను గమనించాలి
పందులను పెంచే వారు వారు లేదా పశువులతో తరచూ సన్నిహితంగా ఉండేవారు శ్వాస సంబంధిత లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. స్వైన్ ఇన్ఫ్లుయెంజా సహా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లలో సాధారణంగా కనిపించే లక్షణాలు.. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, శరీర నొప్పులు, నీరసం, అలసట కొన్నిసార్లు జీర్ణాశయ సంబంధిత సమస్యలు. ఈ లక్షణాలు స్వైన్ ఫ్లూకు మాత్రమే ప్రత్యేకమైనవి కావు. అయితే పందులు లేదా ఇతర పశువులతో సంబంధం ఉన్న వివరాలను వైద్యుడికి తెలియజేయడం రోగ నిర్ధారణలో ఉపయోగపడుతుంది.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
పందులతో లేదా పశువులతో సన్నిహితంగా ఉన్న తర్వాత తీవ్రమైన శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో అసౌకర్యం, నిరంతరంగా లేదా మరింత తీవ్రమవుతున్న జ్వరం, తీవ్రమైన నీరసం, అయోమయం, ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం. వైద్యుడిని కలిసినప్పుడు పందులు లేదా పశువులతో జరిగిన సన్నిహిత సంబంధం గురించి తప్పనిసరిగా చెప్పాలి.
తాజావార్తలు
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!