రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి లేని వివాదాన్ని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్రాల అధికార పార్టీ లు ఈ రాజకీయ నాటకంలో భాగస్వాములయ్యాయు. కానీ బీజేపీ పై విమర్శలు, నిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మంత్రులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏలాంటి అనుమతులు లేకండానే ఎన్నో ప్రాజెక్టు లు కడుతున్నారు. వాటి గురించి ఏమి సమాధానమిస్తారు. ఈ నెల 28 వ తేదీన ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించి, ఓ ప్రతినిధి బృందం ఢిల్లీ కి రానుంది. కేంద్ర మంత్రులను కలిసి అన్ని అంశాలను ఏపీ బీజేపీ ప్రతినిధి బృందం వివరిస్తుంది అని పేర్కొన్నారు.