Anti-Hijab Protests: హిజాబ్కు వ్యతిరేకంగా “జుట్టు ముడవడమే” తప్పైంది.. కాల్చి చంపిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Hijab Protests in Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇరాన్ దేశాన్ని కుదిపేస్తోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మహ్స అమినిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ యువతి జట్టు ముడిచి హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్నానని తెలుపుతూ చేసిన ఓ పోస్టు అక్కడ వైరల్ గా మారింది. 23 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ తను జట్టు ముడుస్తూ.. హిజాబ్ కు వ్యతిరేఖంగా పోరాటంలో పాల్గొంటున్నానని ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఆమెను ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని తెలుస్తోంది. జర్నలిస్ట్, మహిళా హక్కుల న్యాయమాది మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఇరాన్ భద్రతా బలగాలు ఆరుసార్లు ఆమెను కాల్చి చంపినట్లు ఆమె ట్వీట్ చేశారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
https://twitter.com/1500tasvir_en/status/1574110465776574467
ఇదిలా ఉంటే మరో మహిళ తన సోదరుడి అంత్యక్రియల్లో జట్టు కత్తిరించుకున్న మరో ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిరసనల్లో ఇప్పటి వరకు 50కి పైగా మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ భద్రతా బలగాల్లో ఐదో వ్యక్తి మరణించారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాయువ్య ఇరాన్లోని ఉర్మియా నగరంలో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన బసిజ్ మరణించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అశాంతికి కారణం అవతున్న నిరసనకారులపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.
మహ్సా అమిని చనిపోయి పది రోజులు గుడస్తున్నా.. ఇరాన్ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే గుండె జబ్బులతో మహ్సా అమిని చనిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్దమని తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని ఆమె తండ్రి వెల్లడించారు. మోరాలిటీ పోలీసులే నా కుమార్తెను కొట్టి చంపారని.. కనీసం డెత్ రిపోర్టు కూడా చూడనివ్వలేదని అధికారులపై, ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
https://twitter.com/AlinejadMasih/status/1573963922306129920
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..