Trump: ట్రంప్ షాక్.. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు పెంపు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్
- స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు పెంపు
- బుధవారం నుంచే అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. గతంలో సుంకాలను పెంచిన ట్రంప్.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా స్టీల్, అల్యూమినియంపై 25 శాతం నుంచి 50 శాతానికి సుంకాలను పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. దీంతో మరోసారి అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. ఆయా దేశాలతో చర్చలు జరుగుతుండగానే ఊహించని విధంగా ట్రంప్ సుంకాలను పెంచేశారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్సీబీకే ఆడుతాను!
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
గత వారం పెన్సిల్వేనియాలోని ఒక ప్లాంట్ను ట్రంప్ సందర్శించారు. ఆ సమయంలో ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచబోతున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే ట్రంప్ పెంచేశారు. వైట్హౌస్ ప్రకారం.. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
తాజా నిర్ణయం వాణిజ్య భాగస్వాములతో ఉద్రిక్తతలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిపాలనలో దూకుడుగా వెళ్తున్నారు. మిత్రదేశాలతో సహా శత్రు దేశాలపై కూడా భారీ సుంకాలను పెంచే చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టాలు చవిచూడడంతో సుంకాల పెంపును ట్రంప్ వాయిదా వేశారు. ఓ వైపు ఆయా దేశాలతో చర్చలు జరుగుతుండగా మరోసారి అమాంతంగా సుంకాలను పెంచేశారు. తాజా పెంపు నిర్ణయంపై దేశాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!