Mass layoffs: మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులను తొలగించే పనిలో స్ట్రీమింగ్ దిగ్గజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After Meta, Disney to freeze hiring, fire employees, a leaked memo reveals: ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ట్విటర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ దారిలో ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలోని 13 శాతం అంటే దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం వెల్లడించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆదాయం తగ్గడం నేపథ్యంలో పలు ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి.
Read Also: S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
తాజాగా ఈ జాబితాలో స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ కూడా ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్నీ కొత్త నియామకాలను నిలిపేసింది. తాజాగా కంపెనీ సీఈఓ బాబ్ చాపెల్ ఓ మోమోలో ఉద్యోగుల తొలగింపు విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు మార్గాలను డిస్నీ అణ్వేషిస్తున్నట్లు.. వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని చాపెల్ కోరాడు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో పొదుపు మార్గాలను డిస్నీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిస్నీలో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఈఓ బాబ్ చాపెల్ మెమోలో పేర్కొన్నాడు.
ఆదాయం పరంగా డిస్నీ పెద్దగా రాణించడం లేదు. దీనికి తోడు కంపెనీ షేర్లు పడిపోయాయాయి. 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వార్నర్ బ్రదర్స్, నెట్ ఫ్లిక్స్ లు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇదే దారిలో డిస్నీ కూడా సిబ్బందిని తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మెటాతో పాటు ట్విట్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచాయి. ట్విట్టర్ టేకోవర్ తరువాత 50 శాతం సిబ్బందిని తొలగిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, మాంద్యం భయాలు టెక్ కంపెనీలు భయపెడుతున్నాయి. దీంతో తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!