S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar Meets Ukraine Minister To Discuss Ways To End Russia War: కంబోడియా వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో భేటీ అయ్యారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలపై చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం జైశంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. కంబోడియా రాజధాని నమ్ పెన్ లో జరుగుతన్న ఆసియాన్ – ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జైశంకర్, కుబేలాను కలిశారు.
Read Also: Guinness World Record: రికార్డ్ బద్దలు.. 24 గంటల్లోనే అత్యధిక బార్లు తిరిగేశాడు..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని.. ఇటీవల పరిణామాలు, ధాన్యం చొరవ, అణు ఆందోళనలపై చర్చించనట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ రష్యా పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన తర్వాత జైశంకర్ మాస్కోకు వెళ్లడం ఇదే తొలిసారి. భేటీ అనంతరం ఉక్రెయిన్ ఫారిన్ మినిష్టర్ కులేబా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగించే మార్గాలపై చర్చించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రష్యా వెంటనే ఘోరమైన దాడులను విరమించుకోవాలని.. ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను ఉపసంహరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రపంచ ఆహార భద్రతపై దృష్టి సారించినట్లు కులేబా అన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడిపై భారతదేశం తటస్థంగా ఉంది. ఇరు దేశాలు దౌత్యం, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత పలుమార్లు ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రపంచదేశాలు స్వాగతించాయి. అక్టోబర్ 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో మాట్లాడుతూ.. శాంతి ప్రయత్నాలకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
Pleasure to meet FM @DmytroKuleba of Ukraine.
Our discussions covered recent developments in the conflict, the grain initiative and nuclear concerns. pic.twitter.com/dPIjKfhBIh
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 12, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!