S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar Meets Ukraine Minister To Discuss Ways To End Russia War: కంబోడియా వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో భేటీ అయ్యారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలపై చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం జైశంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. కంబోడియా రాజధాని నమ్ పెన్ లో జరుగుతన్న ఆసియాన్ – ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జైశంకర్, కుబేలాను కలిశారు.
Read Also: Guinness World Record: రికార్డ్ బద్దలు.. 24 గంటల్లోనే అత్యధిక బార్లు తిరిగేశాడు..
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని.. ఇటీవల పరిణామాలు, ధాన్యం చొరవ, అణు ఆందోళనలపై చర్చించనట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ రష్యా పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన తర్వాత జైశంకర్ మాస్కోకు వెళ్లడం ఇదే తొలిసారి. భేటీ అనంతరం ఉక్రెయిన్ ఫారిన్ మినిష్టర్ కులేబా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగించే మార్గాలపై చర్చించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రష్యా వెంటనే ఘోరమైన దాడులను విరమించుకోవాలని.. ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను ఉపసంహరించుకోవాలని, శాంతికి కట్టుబడి ఉండాలని కోరారు. ప్రపంచ ఆహార భద్రతపై దృష్టి సారించినట్లు కులేబా అన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడిపై భారతదేశం తటస్థంగా ఉంది. ఇరు దేశాలు దౌత్యం, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత పలుమార్లు ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రపంచదేశాలు స్వాగతించాయి. అక్టోబర్ 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో మాట్లాడుతూ.. శాంతి ప్రయత్నాలకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
Pleasure to meet FM @DmytroKuleba of Ukraine.
Our discussions covered recent developments in the conflict, the grain initiative and nuclear concerns. pic.twitter.com/dPIjKfhBIh
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 12, 2022
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!