Afghanistan: ఆఫ్ఘన్ లో దుర్భర పరిస్థితులు… సగం మంది జనాభాకు తిండికి తిప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్య్లూ ఎఫ్ పీ) నివేదిక ప్రకారం ఆఫ్ఘన్ లోని సగం జనాభాకు తిండికి తిప్పలు ఏర్పడిందని తెలిపింది. సగం జనాభా ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. ఆఫ్ఘన్ లో 1.97 కోట్ల జనాభాకు ఆహారం దొరకడం లేదు. చేయడానికి పనిలేక… పస్తులు ఉండలేక అక్కడి ప్రజలు అవయవాలను కూడా అమ్ముకుంటున్నారు. కిడ్నీలను అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సొంత కూతుళ్లను, బిడ్డలను వేరే దారి లేక అమ్ముకుంటున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కు ప్రపంచ సాయం అందడం లేదు. ఆఫ్ఘన్ పౌర పాలనలో ఉన్నప్పుడు ఎక్కువగా విదేశాల నుంచి నిధులు వచ్చేవి… అయితే ఎప్పుడైతే తాలిబన్లు అధికారాన్ని చేపట్టారో అప్పటి నుంచి ఆ సాయం కూడా అందడం లేదు.
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల కాలంలో తీవ్రవాద దాడులు కూడా ఎక్కువయ్యాయి. మైనారిటీలు అయిన వారిపై దాడులు జరుగుతున్నాయి. ఐఎస్ఎస్ కే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతోంది. షియాలు, హజారాల వంటి మైనారిటీలే లక్ష్యంగా మసీదుల్లో ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!