Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 9 వేల మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇరు దేశాలు కూడా ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గతేడాది ఫిబ్రరి 24 న ప్రారంభమైన ఉక్రెయిన్ వార్ లో ఇప్పటి వరకు 9000 మంది పౌరులు మరణించారని తెలిపింది. ఇందులో 500 మంది చిన్నారులు చంపబడ్డారని యూఎన్ మానవహక్కుల పర్యవేక్షణ మిషన్(HRMMU) శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Maruti Suzuki Ignis : కేవలం 12 వేలకే.. మారుతీ కారు.. ఫీచర్లు వింటే షాక్ అవ్వాల్సిందే
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ముఖ్యంగా ఉక్రెయిన్ పౌరులు ఎక్కువగా చనిపోయారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య తక్కువగా ఉంది.. అయితే మే, జూన్ నెల్లో మళ్లీ యుద్ధంలో మరణించేవారి సంఖ్య పెరిగినట్లు యూఎన్ పేర్కొంది. జూన్ 27న తూర్పు ఉక్రెయిన్లోని క్రామాటోర్స్క్పై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది పౌరులు మరణించారు. శుక్రవారం పశ్చిమ నగరమైన ఎల్వీవ్ పై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున దాడిలో కనీసం 37 మంది గాయపడ్డారు.
రష్యా క్రమంగా ఉక్రెయిన్ పై వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుంది. రష్యా దాడుల్లో కీవ్, ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, జపొరోజ్జియా, ఎల్వీవ్ వంటి నగరాలు దారుణంగా ధ్వంసం అయ్యాయి. వందల్లో ప్రజలు చనిపోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని మౌళిక సదుపాయాలైన తాగునీరు, డ్రైనేజ్, కరెంట్ సౌకర్యాలపై రష్యా దాడులు చేస్తోంది. బూచా, మరియోపోల్ వంటి నగరాల్లో గతేడాది రష్యా దురాగతలాలకు పాల్పడింది.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!