Thailand-Cambodia War: బోర్డర్లో ఘర్షణ.. 9 మంది పౌరులు మృతి
- థాయ్లాండ్-కంబోడియా బోర్డర్లో ఘర్షణ
- 9 మంది పౌరులు మృతి, 14 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్లాండ్-కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఇక కంబోడియా జరిపిన దాడుల్లో చిన్నారి సహా తొమ్మిది మంది థాయ్లాండ్ పౌరులు మరణించారు. గురువారం ఉదయం 7:35 గంటలకు సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. థాయ్ సైన్యం ప్రకారం.. టా ముయెన్ ఆలయం సమీపంలోని వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా డ్రోన్ను గుర్తించిన తర్వాత ఘర్షణ మొదలైంది. దీంతో నమ్ పెన్లోని థాయ్లాండ్ రాయబార కార్యాలయం తన పౌరులను కంబోడియా విడిచి వెళ్లాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 50 మంది దుర్మరణం
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
తాజా ఘర్షణలో 9 మంది మరణించగా 14 మంది గాయపడ్డారని థాయ్ సైన్యం నివేదించింది. సిసాకెట్ ప్రావిన్స్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆరుగురు మరణించగా, సురిన్ మరియు ఉబోన్ రాట్చథానిలో మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Students Study Tips: విద్యార్థులు పరిక్షల్లో టాప్ చేయాలంటే వీటిని పాటిస్తే సరి.. మీరే బెస్ట్.!
ఇక థాయ్లాండ్ దురాక్రమణపై చర్య తీసుకోవాలని కంబోడియా ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే థాయ్లాండ్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. థాయ్లాండ్ తీవ్రమైన దురాక్రమణలకు పాల్పడుతుందని కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ పేర్కొన్నారు. యూఎన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే కంబోడియా-థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్ర కావడంతో ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే కంబోడియా సైనిక లక్ష్యాలపై థాయ్లాండ్ జెట్లు దాడి చేశాయి. గురువారం నాడు థాయ్ ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్ నుంచి ఆరు జెట్ విమానాలు మోహరించినట్లు థాయ్ సైన్యం ధృవీకరించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!