Christmas Party: వికటించిన క్రిస్మస్ విందు… 700 మంది అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మునిగిపోయింది. సెమి క్రిస్మస్ అంటూ నెల రోజులు ముందు నుంచే సెల్రబేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేశారు.
Also Read: Uttam Kumar Reddy: రేషన్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు
Also Read
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
కంపెనీ సమీపంలోని ఓ రెస్టారెంట్ గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారి కోసం రకరకాల నోరురించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే, విందు అనంరతరం దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ బస్ అట్లాంటిక్ తమ ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేసింది.
Also Read: Delhi Airport: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..
వారంత వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ (ARS) ధృవీకరించింది. ఆహారం నాణ్యత లోపం వల్లే తమ వారు అస్వస్థకు గురయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సదరు రెస్టారెంట్పై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పశ్చిమ ఫ్రాన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. విందులో ఏ రకమైన ఆహారాన్ని అందించారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!