German Christmas Market: జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో ఏడుగురు భారతీయులకు గాయాలు..
- జర్మనీలోని మాగ్డేబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో దాడి..
- జనంపైకి కారుని ఎక్కించిన తాలెబ్.ఎ ముస్లిం వ్యక్తి..
- ఈ దాడిలో ఏడుగురు భారతీయులకు గాయాలు.. ఖండించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
German Christmas Market: జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన దాడిపై భారత్ స్పందించింది. ముస్లీం వర్గానికి చెందిన దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు చనిపోయారు. అలాగే, ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొనింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. అయితే, గాయపడిన భారతీయులందరితో ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రతినిధులు మాట్లాడారు.
Read Also: Sameer Rizvi Double Century: దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు.. 13 ఫోర్లు, 20 సిక్సర్లతో ఊచకోత
Also Read
అయితే, జర్మనీలోని మాగ్డేబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ప్రాణ నష్టం వాటిల్లింది.. అధిక సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.. బాధితులకు తమ దేశం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. గాయపడిన భారతీయులతో పాటు వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
Read Also: Pushpa – 2 : బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా
కాగా, క్రిస్మస్ పండుగ సమయంలో జర్మనీలో విషాద ఘటన నెలకొంది. మాగ్డెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా సదరు ముస్లిం వ్యక్తి వెళ్లినట్లు సీసీఫుటేజీలో కనిపిస్తుంది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక, గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
7 Indian nationals have been injured in Magdeburg, Germany. 3 have been discharged from the hospital. Indian Mission is in touch with all those injured in the attack: Sources
— ANI (@ANI) December 21, 2024
తాజావార్తలు
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!