China: ఏడాదికి 64 వేల పిల్లలను కడుపులోనే బలి తీసుకుంటున్న కాలుష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
64,000 Babies Die In Womb Every Year Because Of Polluted Air In China: చైనాలో కాలుష్యం తీవ్రత అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుకపై ప్రభావం కనిపిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలోనే పిండం మరణించే దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది అక్కడి 64,000 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నారు. దీనంతటికి చైనా వ్యాప్తంగా ఉన్న కాలుష్యమే కారణం అని తెలిసింది. రాజధాని బీజింగ్ లో గత పదేళ్ల నుంచి కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది చైనా ప్రభుత్వం. అయినప్పటికీ శిశువుల మరణాలు సంభవిస్తున్నాయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది.
Read Also: Boora Narsaiah Goud: కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్.. ఆ తప్పులన్నీ కేంద్రంపై నెట్టారు
Also Read
137 దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం 2015లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 40 శాతం శిలాజ ఇంధనాల దహనం వల్ల గాలిలో పార్టిక్యులర్ మ్యాటర్ (పీఎం) 2.5 పెరగడానికి కారణం అయింది. నేచర్ కమ్యూనికేషన్స్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గాలిలో కాలుష్యం పెరగడం వల్ల గర్భంలోనే పిండం మరణించే సంఖ్యలో చైనా 4వ స్థానంలో ఉంది. గాలి నాణ్యత మెరుగుపరచడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
గర్భంలో ఎదుగుతున్న పిండాలపై గాలి కాలుష్యం గణనీయంగా ప్రభావం చూపిస్తుందని తేలింది. అయితే ఇటీవల కాలంలో చైనా తీసుకుంటున్న కాలుష్య నివారణ చర్యలు మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గాలిలో ఉన్న కాలుష్యం వల్ల పిండానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదని అందుకే మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?