Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..
Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ. కొన్ని సమాధుల్లో లభించిన వేల ఏళ్ల నాటి తేనె ఇప్పటికీ అలాగే చెడిపోకుండా ఉంది.
తాజాగా ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్-నీత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 వేల ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ ‘వైన్’ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తే శాస్త్రవేత్త క్రిష్టియానా కోహ్లెర్ నేతృత్వంలోని జర్మన్-ఆస్ట్రియన్ టీం అబిడోస్ లోని క్వీన్ మెరెట్-నీత్ సమాధిని తవ్వుతుండగా.. వారు పెద్ద జాడీల్లో వైన్ ని కనుగొన్నారు.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
Read Also: Kim Jong Un: కిమ్ పైశాచికం.. పిరానా చేపలకు ఆహారంగా వేసి జనరల్ హత్య..
సమాధిలో చాలా సేంద్రీయ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్పటికాలను కొనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే.. దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్-నీత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశానవాటిక కలిగిన ఏకైక మహిళ ఇమే.
సమాధిలో దొరికిన శాసనాల ప్రకారం 3000 BCలో ట్రెజరీ వంటి ప్రభుత్వ శాఖను నిర్వహించినట్లుగా పరిశోధకులు నిర్దారించారు. ప్రస్తుత తవ్వకాలు ఆమె జీవిత కాలం, ఇతర విషయాలను వెలుగులోకి తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమాధిలో మెరిట్-నీత్ సమాధి చుట్టూ 41 మంది సభికులు, సేవలకుల సమాధులు ఉన్నాయి. కాల్చని మట్టి ఇటుకలు, మట్టి, కలపతో నిర్మించారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!