Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ. కొన్ని సమాధుల్లో లభించిన వేల ఏళ్ల నాటి తేనె ఇప్పటికీ అలాగే చెడిపోకుండా ఉంది.
తాజాగా ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్-నీత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 వేల ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ ‘వైన్’ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తే శాస్త్రవేత్త క్రిష్టియానా కోహ్లెర్ నేతృత్వంలోని జర్మన్-ఆస్ట్రియన్ టీం అబిడోస్ లోని క్వీన్ మెరెట్-నీత్ సమాధిని తవ్వుతుండగా.. వారు పెద్ద జాడీల్లో వైన్ ని కనుగొన్నారు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: Kim Jong Un: కిమ్ పైశాచికం.. పిరానా చేపలకు ఆహారంగా వేసి జనరల్ హత్య..
సమాధిలో చాలా సేంద్రీయ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్పటికాలను కొనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే.. దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్-నీత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశానవాటిక కలిగిన ఏకైక మహిళ ఇమే.
సమాధిలో దొరికిన శాసనాల ప్రకారం 3000 BCలో ట్రెజరీ వంటి ప్రభుత్వ శాఖను నిర్వహించినట్లుగా పరిశోధకులు నిర్దారించారు. ప్రస్తుత తవ్వకాలు ఆమె జీవిత కాలం, ఇతర విషయాలను వెలుగులోకి తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమాధిలో మెరిట్-నీత్ సమాధి చుట్టూ 41 మంది సభికులు, సేవలకుల సమాధులు ఉన్నాయి. కాల్చని మట్టి ఇటుకలు, మట్టి, కలపతో నిర్మించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!