Kim Jong Un: కిమ్ పైశాచికం.. పిరానా చేపలకు ఆహారంగా వేసి జనరల్ హత్య..
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశాన్ని నియంతలా పాలిస్తున్నాడు, కానీ అతనో నియంత అని అక్కడి ప్రజలకు కూడా తెలియదు. అతడిని అతని నాన, తాతలను అక్కడ దేవుళ్లుగా కొలుస్తుంటారు. ఇదిలా ఉంటే అక్కడి శిక్షల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. సౌత్ కొరియా సినిమాలు చూసినా, ఏదైనా మతాన్ని పాటించినా, కనీసం పాటలు విన్నా కూడా అక్కడి మరణమే గతి. ఆ శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి.
కిమ్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర కొరియాలో జరిగింది. తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేశారు.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
Read Also: AUS vs SL: ఎట్టకేలకు ఖాతా తెరిచిన ఆసీస్.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం
మాంసాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన చేపలైన ‘పిరాన్హా’ చేపలకు ఆహారంగా వేసినట్లు డైలీస్టార్ నివేదించింది. తిరుగుబాటుకు కుట్ర చేశాడని చెబుతూ..అతని కాళ్లు, చేతులు నరికేసి, పిరానా చేపలు ఉన్న కొలనులో పడేసి చంపేశారు. కిమ్ ర్యాంగ్సాగ్ రెసిడెన్స్ లో ఈ భారీ ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు నివేదించింది. 1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా ‘ ద స్పై హూ లవ్డ్ మీ’ సినిమాలో విలన్ తన ప్రత్యర్థులను షార్క్ చేపలు ఉన్న ఆక్వేరియంలో వేసి హత్య చేస్తుంటాడు. సరిగ్గా ఇలాగే కిమ్ తనపై కుట్ర పన్నిన వ్యక్తిని పిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు.
కిమ్ తన ఆక్వేరియం కోసం వందల పిరాన్హా చేపలను బ్రెజిల్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాడని భావిస్తున్నారు. మాంసాన్ని తినే ఈ చేపలు పదునైన రేజర్ దంతాలను కలిగి ఉంటాయి. ఇవది నిమిషాల్లో మాంసాన్ని చీల్చి తినేస్తాయి. 2011లో అధికారం చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటి వరకు పలు ఆరోపణల్లో 16 మంది కీలక అధికారులను అత్యంత దారుణంగా మరణశిక్ష విధించాడు. దీనికి ముందు ఇలాగే 2019లో తిరుగుబాటుకు కుట్ర పన్నాడని ఓ జనరన్ని ఉరితీశాడు. పులులకు ఆహారంగా ఇవ్వడం, ఆకలితో ఉన్న కుక్కలు ఎరగా వేయడం, తలలు నరికి చంపడం, సజీవ దహనం చేయడం వంటి అత్యంత క్రూరమైన శిక్షణలను కిమ్ రాజ్యంలో విధిస్తుంటాడు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?