SCO Summit: ట్రెండింగ్గా మారిన ఐదు ఫొటోలు.. ఏవేవంటే..!
- ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన షాంఘై సహకార సదస్సు
- ట్రెండింగ్గా మారిన ఐదు ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు. ఇక సమావేశం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపించారు. ఇక ఈ సమావేశంలో ఐదు ఫొటోలు హైలెట్గా నిలిచాయి. ప్రస్తుతం అవి ట్రెండింగ్గా మారాయి. ప్రపంచానికి ఒక సందేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ఇక సమావేశానికి ముందు ఆయా దేశాధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలో మోడీ-పుతిన్-జిన్పింగ్ చాలా సేపు ముచ్చటించారు. ముగ్గురూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహం కనిపించారు. ఆద్యంతం మోడీ నవ్వుతూ కనిపించారు. ఇక మోడీ-పుతిన్ అయితే ఆలింగనం చేసుకుని షేక్హ్యాండ్లు ఇచ్చుకున్నారు.
ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు నిలబడుతుండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లైన్లో నిలబడి ఉన్నారు. కానీ మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదు. పుతిన్తో ఏదో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. షెహబాజ్ మౌనంగా అలా ఉండిపోయారు. గ్రూప్ ఫొటో దిగిన తర్వాత కూడా పాక్ ప్రధాని వైపు చూసేందుకు ఇష్టపడలేదు. మళ్లీ ముగ్గురూ కలిసి సంభాషించుకున్నారు.
ఇక ఎస్సీవో సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చల కోసం మోడీ-పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇద్దరం ఒకే కారులో ప్రయాణించినట్లు మోడీ పేర్కొన్నారు. పుతిన్తో సంభాషణలు ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. మోడీ-పుతిన్ ఉపయోగించిన కారు చైనా జాతీయ గౌరవంతో ముడిపడి ఉన్న కారు. దీన్ని అగ్ర నాయకులు, ప్రముఖుల కోసమే రూపొందించిన కారు.

ఇక ఆయా దేశాధి నేతల కుటుంబాలతో జిన్పింగ్ ఫొటోలు దిగారు. అనంతరం అందరూ కలిసి అధికారికంగా ఒక గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోకుండా పుతిన్ వెళ్లిపోతుంటే.. షెహబాజే పరిగెత్తుకుంటూ వచ్చి పుతిన్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనిపై షరీఫ్పై భయంకరంగా ట్రోలింగ్ నడిచింది.

ఇదిలా ఉంటే శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు మోడీ కరచాలనం ఇచ్చారు. వీపు తట్టి పలకరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ.. పాకిస్థాన్ వైపు నిలబడింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారాయి. బాయ్కట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో నినాదం నడిచింది. పాక్ ప్రధానిని తప్పించుకున్న.. టర్కీ అధ్యక్షుడితో మాత్రం తప్పించుకోవడం కుదరక షేక్హ్యాండిచ్చారు.

- Tags
- 5 pictures
- china
- modi
- Putin
- SCO Summit
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!