China: 3 నెలల్లో మూడు కోవిడ్ వేవ్లు.. కరోనాతో అతలాకుతలం కానున్న చైనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Waves For About 3 Months, Covid Expert On China: కోవిడ్ మహమ్మారికి జన్మస్థానం అయిన చైనా, కోవిడ్ బారిన పడి అల్లాడుతోంది. గతంలో కొన్ని కేసుల సంఖ్య వేలకు చేరేందుకు కొన్ని రోజలు పడితే.. ప్రస్తుతం అక్కడ గంటల్లోనే వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయడంతో చైనా వ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా సిబ్బంది కరువయ్యారు. రాబోయే మూడు నెలల్లో చైనా కోవిడ్ తో అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు భావిస్తున్నారు.
Read Also: Mansukh Mandaviya: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి..
Also Read
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
శీతాకాలం మూడు నెలల్లో చైనా మూడు కోవిడ్ వేవ్ లు అటాక్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం మరణాల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వు జున్యు ప్రకారం.. ప్రస్తుతం శీతాకాలంలో చైనాలో కేసుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కోవిడ్ తరంగాలు వస్తాయిన అంచానా వేశారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఒక కోవిడ్ వేవ్ ఉంటుందని.. జనవరి 21న చైనా న్యూ ఇయర్ సెలవుకు ముందు దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాకు వెళ్లారని.. ఆ తరువాత మరో వేవ్ రావచ్చని.. ఫిబ్రవరి-మార్చిలో థర్డ్ వేవ్ చైనాపై అటాక్ చేయవచ్చని అంచానా వేశారు.
ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కేసులు పెరిగాయి. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. మందుల డిమాండ్ పెరగడంతో స్టాక్ అయిపోతుందని పాశ్చాత్య మీడియాలు నివేదిస్తున్నాయి. రాబోయే నెలల్లో 10 లక్షల మరణాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతీ 10 లక్షల మందికి 684 మరణాలు జరగొచ్చని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ప్రొఫెసర్లు అంచనా వేస్తున్నారు. మొత్తం చైనాలో 140 కోట్ల జనాభా ఉంది. నిపుణుల అంచనా మేరకు 9,64,400 మరణాలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాబోయే మూడు నెలల్లో 60 శాతం మంది చైనీయులు కరోనా బారిన పడతారని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!