Mansukh Mandaviya: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిణామాల దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్యమంత్రి సోమవారం అత్యున్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. మరోసారి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సూచించారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
రాహుల్ గాంధీకి లేఖ రాశారు మాన్సుఖ్ మాండవీయ. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోవిడ్ నిబంధనల గురించి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. మాస్క్, శానిటైజర్ వాడాకాన్ని అమలు చేయాలని మాండవీయ అన్నారు. టీకాలు వేసుకున్న వారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారు. ఒక వేళ కోవిడ్ నిబంధనలను పాటించకపోతే యాత్రను నిలిపి వేయాలని లేఖలో సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానా రాష్ట్రంలోకి చేరుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. వచ్చే ఏడాది జనవరి 26న కాశ్మీర్ లో ఈ యాత్ర పూర్తికానుంది.
తాజావార్తలు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..