Mansukh Mandaviya: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిణామాల దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్యమంత్రి సోమవారం అత్యున్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. మరోసారి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సూచించారు.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
Read Also: Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
రాహుల్ గాంధీకి లేఖ రాశారు మాన్సుఖ్ మాండవీయ. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోవిడ్ నిబంధనల గురించి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. మాస్క్, శానిటైజర్ వాడాకాన్ని అమలు చేయాలని మాండవీయ అన్నారు. టీకాలు వేసుకున్న వారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారు. ఒక వేళ కోవిడ్ నిబంధనలను పాటించకపోతే యాత్రను నిలిపి వేయాలని లేఖలో సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానా రాష్ట్రంలోకి చేరుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. వచ్చే ఏడాది జనవరి 26న కాశ్మీర్ లో ఈ యాత్ర పూర్తికానుంది.
తాజావార్తలు
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?