Mansukh Mandaviya: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి..
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిణామాల దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్యమంత్రి సోమవారం అత్యున్నత స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. మరోసారి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు, బూస్టర్ డోసులు వేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సూచించారు.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
రాహుల్ గాంధీకి లేఖ రాశారు మాన్సుఖ్ మాండవీయ. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కోవిడ్ నిబంధనల గురించి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. మాస్క్, శానిటైజర్ వాడాకాన్ని అమలు చేయాలని మాండవీయ అన్నారు. టీకాలు వేసుకున్న వారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరారు. ఒక వేళ కోవిడ్ నిబంధనలను పాటించకపోతే యాత్రను నిలిపి వేయాలని లేఖలో సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానా రాష్ట్రంలోకి చేరుతుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో సాగింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగనుంది. వచ్చే ఏడాది జనవరి 26న కాశ్మీర్ లో ఈ యాత్ర పూర్తికానుంది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?