US- India Tariffs: నేటి నుంచి భారత్పై 25 శాతం సుంకాలు.. ఏ ఏ రంగాలను ప్రభావితం చేయనుందంటే..?
- నేటి నుంచి భారత్పై యూఎస్ 25 శాతం సుంకాల అమలు..
- భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం..
- ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారత ప్రతినిధులతో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US- India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం నేటి (ఆగస్టు 1న) నుంచి అమలులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. భారత్ మన స్నేహ దేశం అయినప్పటికీ, వారు విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక టారీఫ్స్ విధించే దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్నారు. అంతేకాక ఇండియా- రష్యా నుంచి సైనిక సామగ్రి, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
భారతదేశంలో వీటిపై ప్రభావం చూపుతుంది..?
భారతదేశంలో ఈ 25 శాతం సుంకాల ప్రభావం సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై దాదాపు 39%, కూరగాయల నూనెలపై 45%, ఆపిల్, మొక్కజొన్నపై దాదాపు 50% రేట్లు పెరిగాయి. అయితే, ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారత్ కి రానుంది. ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ లాంటి రంగాలపై విధించే టారీఫ్స్ పై ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. కాగా, అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు 30 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.
Read Also: P4 Policy: మాకేం లక్షల్లో జీతాల్లేవ్.. 164 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు!
అయితే, జపాన్ (15%), వియత్నాం (20%), ఇండోనేషియా (19%) కంటే ఎక్కువ సుంకం భారతదేశం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఔషధ రంగంలో భారతదేశం జనరిక్ ఔషధాలను ఎక్స్ పోర్ట్ చేస్తుంది. యూరప్ దేశాలు ఖరీదైన, బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తాయి. అందువల్ల 25 శాతం సుంకం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు అనే భావన ఉంది. అలాగే, స్మార్ట్ఫోన్ ఎగుమతుల విషయంలో కూడా చైనా (30%)తో పోలిస్తే భారతదేశం (25%)పై తక్కువ టారీఫ్స్ కలిగి ఉంది.
తాజావార్తలు
-
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
-
CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!