Nigeria: యూనివర్సిటీ నుంచి 24 మంది విద్యార్థినుల కిడ్నాప్ చేసిన బందిపోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.
దేశ భద్రతను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా బోలా అహ్మద్ టినుబు అధికారం చేపట్టిన తర్వాత ఇది తొలిదాడి. బందిపోట్లు యూనివర్సిటీలోకి మోటార్ సైకిళ్ల ద్వారా ప్రవేశించి కిటికీలను పగలగొట్టి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించారు. దాడి చేసిన సమయంలో యూనివర్సిటీ పనులు చేస్తున్న వెల్డర్లను బందిపోట్లు తమ అదుపులో ఉంచుకున్నారు. ఘటన స్థలానికి రాజధాని గుసౌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు అక్కడి నుంచి మోహరించాయి. బందిపోట్లు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
Also Read
Read Also: Pakistan: పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్.. ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక..
భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థినులను కాపాడాయని అక్కడి అధికారులు చెప్పారు. సైనిక చర్య కొనసాగుతుందని వెల్లడించారు. వాయువ్య, మధ్య నైజీరియా రాష్ట్రాల్లో జంఫారా ఒకటి. ఇక్కడ తరుచుగా గ్రామాలపై బందిపోట్లు దాడులు చేసి జనాలను చంపడం, కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు జంఫారా, కట్సినా, కడునా, నైజర్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామాలు, పాఠశాలల్లోని విద్యార్థులను కిడ్నాప్ చేస్తూ, ప్రభుత్వ, వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బలు వసూలు చేస్తుంటారు.
2021లో జంఫారా రాష్ట్రంలోని జంగేబే పట్టణంలోని బాలికల బోర్డింగ్ పాఠశాలపై దాడి చేసి 300 మందికి పూగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత డబ్బు చెల్లించడంతో వారిని విడుదల చేశారు. మరోవైపు నైజీరియా ఈశాన్య ప్రాంతంలో 14 ఏళ్లుగా జీహాదీలు తిరుగుబాటు చేస్తున్నారు. వీరివల్ల 40,000 మంది మరణించారు. రెండు మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!