Nigeria: యూనివర్సిటీ నుంచి 24 మంది విద్యార్థినుల కిడ్నాప్ చేసిన బందిపోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.
దేశ భద్రతను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా బోలా అహ్మద్ టినుబు అధికారం చేపట్టిన తర్వాత ఇది తొలిదాడి. బందిపోట్లు యూనివర్సిటీలోకి మోటార్ సైకిళ్ల ద్వారా ప్రవేశించి కిటికీలను పగలగొట్టి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించారు. దాడి చేసిన సమయంలో యూనివర్సిటీ పనులు చేస్తున్న వెల్డర్లను బందిపోట్లు తమ అదుపులో ఉంచుకున్నారు. ఘటన స్థలానికి రాజధాని గుసౌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు అక్కడి నుంచి మోహరించాయి. బందిపోట్లు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Read Also: Pakistan: పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్.. ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక..
భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థినులను కాపాడాయని అక్కడి అధికారులు చెప్పారు. సైనిక చర్య కొనసాగుతుందని వెల్లడించారు. వాయువ్య, మధ్య నైజీరియా రాష్ట్రాల్లో జంఫారా ఒకటి. ఇక్కడ తరుచుగా గ్రామాలపై బందిపోట్లు దాడులు చేసి జనాలను చంపడం, కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు జంఫారా, కట్సినా, కడునా, నైజర్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామాలు, పాఠశాలల్లోని విద్యార్థులను కిడ్నాప్ చేస్తూ, ప్రభుత్వ, వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బలు వసూలు చేస్తుంటారు.
2021లో జంఫారా రాష్ట్రంలోని జంగేబే పట్టణంలోని బాలికల బోర్డింగ్ పాఠశాలపై దాడి చేసి 300 మందికి పూగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత డబ్బు చెల్లించడంతో వారిని విడుదల చేశారు. మరోవైపు నైజీరియా ఈశాన్య ప్రాంతంలో 14 ఏళ్లుగా జీహాదీలు తిరుగుబాటు చేస్తున్నారు. వీరివల్ల 40,000 మంది మరణించారు. రెండు మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!