Nigeria: యూనివర్సిటీ నుంచి 24 మంది విద్యార్థినుల కిడ్నాప్ చేసిన బందిపోట్లు..
Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.
దేశ భద్రతను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా బోలా అహ్మద్ టినుబు అధికారం చేపట్టిన తర్వాత ఇది తొలిదాడి. బందిపోట్లు యూనివర్సిటీలోకి మోటార్ సైకిళ్ల ద్వారా ప్రవేశించి కిటికీలను పగలగొట్టి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించారు. దాడి చేసిన సమయంలో యూనివర్సిటీ పనులు చేస్తున్న వెల్డర్లను బందిపోట్లు తమ అదుపులో ఉంచుకున్నారు. ఘటన స్థలానికి రాజధాని గుసౌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు అక్కడి నుంచి మోహరించాయి. బందిపోట్లు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
Also Read
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
Read Also: Pakistan: పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్.. ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక..
భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థినులను కాపాడాయని అక్కడి అధికారులు చెప్పారు. సైనిక చర్య కొనసాగుతుందని వెల్లడించారు. వాయువ్య, మధ్య నైజీరియా రాష్ట్రాల్లో జంఫారా ఒకటి. ఇక్కడ తరుచుగా గ్రామాలపై బందిపోట్లు దాడులు చేసి జనాలను చంపడం, కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు జంఫారా, కట్సినా, కడునా, నైజర్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామాలు, పాఠశాలల్లోని విద్యార్థులను కిడ్నాప్ చేస్తూ, ప్రభుత్వ, వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బలు వసూలు చేస్తుంటారు.
2021లో జంఫారా రాష్ట్రంలోని జంగేబే పట్టణంలోని బాలికల బోర్డింగ్ పాఠశాలపై దాడి చేసి 300 మందికి పూగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత డబ్బు చెల్లించడంతో వారిని విడుదల చేశారు. మరోవైపు నైజీరియా ఈశాన్య ప్రాంతంలో 14 ఏళ్లుగా జీహాదీలు తిరుగుబాటు చేస్తున్నారు. వీరివల్ల 40,000 మంది మరణించారు. రెండు మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు.
తాజావార్తలు
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!