Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.