Covid-19: భారత్తో సహా చైనాపై 10 దేశాల ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 nations on alert for China arrivals, demand negative Covid report: చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యను చెప్పడానికి కూడా అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రోజుకు దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చైనా తన ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరిలో ఈ కేసుల సంఖ్య ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం రానున్న రోజుల్లో చైనాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని అంచనా వేస్తున్నారు. అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైనా కోవిడ్ పరిణామాల నేపథ్యంలో పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలు చైనాపై ఆంక్షలు విధించాయి.
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
Read Also: Bairi Naresh: బైరి నరేష్ అరెస్ట్..
ఇండియాతో పాటు యూఎస్ఏ, యూకే, ఇటలీ, స్పెయిన్, మలేషియా, సౌత్ కొరియా, ఇజ్రాయిల్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్ నుండి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ నెగిటెవ్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలని సూచించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు లక్షణాలు కనిపిస్తే లేదా పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్ చేస్తోంది.
ఇదే మాదిరి ఇతర దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా జనవరి 5 నుంచి చైనా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష రిపోర్టు ఇవ్వాలని సూచించింది. చైనా, హాంకాంగ్, మకావు నుంచి బయలుదేరే 2 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న ప్రయాణికులు, తమ ప్రయాణానికి రెండు రోజుల ముందు కరోనా నెగిటివ్ రిపోర్ట్ అవసరం. కోవిడ్ దృష్ట్యా చైనా, హాంకాంగ్ వెళ్లే తమ పౌరులు మరోసారి ఆలోచించాలని కోరింది.
- Tags
- china
- Covid 19
- india
- omicron BF-7
- USA
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!