AP High Court: విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలంటూ ఏపీ హైకోర్టు సీరియస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది. చట్టాన్ని, ఆదేశాలను అమలుచేసినట్లు రుజువులు చూపించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్టీఈ రూల్స్ మేరకు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
TS SSC Supplementary Result 2022: అలర్ట్.. నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ఈ కేటగిరీలో ఎంత మందికి అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని, అవి సరిగా లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు బాధ్యత వహించాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారుల చర్యలు పరోక్షంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఉన్నాయంటూ ఆక్షేపించింది. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికింది. సమర్థతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సూచించింది. తాండవ యోగేష్ అనే అడ్వొకేట్ గతంలో దాఖలుచేసిన ఈ కోర్టు ధిక్కార పిటిషన్పై ఇంతకు ముందే విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
ఈ వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ పీకే మిశ్ర, జస్టిస్ డీవీఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయిస్తున్నారనే సంగతి చాలా మంది పేరెంట్స్కి తెలియదని, అందువల్ల దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని న్యాయవాది చెప్పారు. ఏపీలో మొత్తం 16 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, ఒక్కో స్కూల్లో కనీసం 5 సీట్లను ఆర్టీఈ కింద కేటాయించినా దాదాపు 80 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!