AP High Court: విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలంటూ ఏపీ హైకోర్టు సీరియస్.
AP High Court: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలైనట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలోదో వివరణ ఇవ్వాలని కోరింది. చట్టాన్ని, ఆదేశాలను అమలుచేసినట్లు రుజువులు చూపించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్టీఈ రూల్స్ మేరకు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో అయినా ఉండాలి లేదా మీరు జైల్లో అయినా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
TS SSC Supplementary Result 2022: అలర్ట్.. నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
ఈ కేటగిరీలో ఎంత మందికి అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని, అవి సరిగా లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు బాధ్యత వహించాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారుల చర్యలు పరోక్షంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఉన్నాయంటూ ఆక్షేపించింది. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికింది. సమర్థతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సూచించింది. తాండవ యోగేష్ అనే అడ్వొకేట్ గతంలో దాఖలుచేసిన ఈ కోర్టు ధిక్కార పిటిషన్పై ఇంతకు ముందే విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
ఈ వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ పీకే మిశ్ర, జస్టిస్ డీవీఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయిస్తున్నారనే సంగతి చాలా మంది పేరెంట్స్కి తెలియదని, అందువల్ల దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని న్యాయవాది చెప్పారు. ఏపీలో మొత్తం 16 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, ఒక్కో స్కూల్లో కనీసం 5 సీట్లను ఆర్టీఈ కింద కేటాయించినా దాదాపు 80 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!