Waking Up to Alarm Increases Heart Attack Risk: మార్నింగ్ అలారం పెట్టుకుంటే ప్రమాదమా..?
- అలారం పెట్టుకుని పడుకుంటే గుండెపోటు,
- బీపీ పెరిగే ప్రమాదం
- 32 మందిపై పరిశోధన చేసిన వర్జీనియా విశ్వవిద్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం.
పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే ఆఫీస్కు వెళ్లేందుకో, కాలేజ్కు వెళ్లేందుకో లేదా మరేదైనా పని ఉన్నా.. ఆ సమయానికి లేవలేము అనుకునే వాళ్లంతా అలారంపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారందరికీ మతిపోయే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అలారం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటా.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాన్ని వింటే మీరే షాకవుతారు.
మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. పొద్దుపొద్దున్నే వినిపించే అలారం మోతతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో తేలింది. 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్ ధరించి పాల్గొన్నారని చెప్పారు. మొదటిరోజు ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని ఆ 32 మందికి సూచించినట్లు పేర్కొన్నారు. రెండోరోజు.. ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పి, ఈ రెండు ఫలితాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయన్నారు. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్ ప్రెజర్లో పెరుగుదలను గుర్తించినట్లు తెలిపారు.
Also Read
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే బలవంతంగా మేల్కొన్న వారిలో 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుందని, ఆ స్పందన కారణంగా కార్టిసోల్, అడ్రినలిన్ విడుదల అవుతుందన్నారు. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయని చెప్పారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారని చెప్పారు. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు. అయితే ప్రతీ రోజు ఒకే సమయానికి సహజంగా నిద్రలేచే అలవాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!