కానిస్టేబుల్ తో ప్రేమాయణం.. భర్తను, కూతుళ్లను వదిలి ఆ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్లో నివాసం ఉంటున్న వెంకటేష్, రాజేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. వెంకటేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రాజేశ్వరికి శిడ్లఘట్టలోనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే అనంత్ కుమార్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వీరు ఎవరి కంటపడకుండా రాసలీలలు సాగిస్తున్నారు. ఇక ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య విగతజీవిగా కనిపించేసరికి భర్త వెంకటేష్ భోరున విలపించాడు. తన భార్యను అనంత్ కుమారే హత్య చేశాడని వెంకటేష్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..