కానిస్టేబుల్ తో ప్రేమాయణం.. భర్తను, కూతుళ్లను వదిలి ఆ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్లో నివాసం ఉంటున్న వెంకటేష్, రాజేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. వెంకటేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రాజేశ్వరికి శిడ్లఘట్టలోనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే అనంత్ కుమార్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వీరు ఎవరి కంటపడకుండా రాసలీలలు సాగిస్తున్నారు. ఇక ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య విగతజీవిగా కనిపించేసరికి భర్త వెంకటేష్ భోరున విలపించాడు. తన భార్యను అనంత్ కుమారే హత్య చేశాడని వెంకటేష్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!