Wife Kills Husband: రోకలిబండతో కొట్టి భర్తను మట్టుబెట్టిన భార్య.. ఇంటిముందే పాతిపెట్టి..?
- అనంతపురం జిల్లాలో వెలుగులోకి దారుణ హత్య ఘటన..
- కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో సంఘటన
- భర్త హనుమంతును భార్య సుకన్య హత్య
- రోకలిబండతో తలపై కొట్టి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కల్యాణదుర్గం మండలంలోని పాతచెరువు గ్రామంలో ఓ భార్య తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హనుమంతుగా గుర్తించగా, నిందితురాలు అతని భార్య సుకన్యగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన నాలుగు నెలల క్రితమే జరిగినప్పటికీ, తాజాగా తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దారుణం బయటపడింది.
Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. నిందితురాలు సుకన్య స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, భర్త హనుమంతుడు అనుమానంతో తరచూ వేధించేవాడని, అందుకే అర్ధరాత్రి సమయంలో రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసినట్లు సుకన్య అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలను తెలుసుకొనేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
Shocking Crime: మిల్క్ షేక్లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..
భర్త హనుమంతు గొర్రెలు కాసుకుంటూ జీవనం చేసేవాడని, వీరికి ఒక కొడుకు సందీప్, ఒక కూతురు అమృత సంతానం ఉన్నారని భార్య తెలిపింది. సుకన్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని, అందువల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని సమాచారం. కొడుకు కూడా గొర్రెలు కాస్తుంటాడు. కూతురు కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. వీరి తండ్రిని చంపిన విషయం బయట ఎక్కడైనా చెబితే నిన్ను కూడా చంపుతానని సుకన్య తన కూతురును బెదిరించిన అమృత. అయితే ఈ అమ్మాయి తన తాతగారి ఊరు అనిమిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లడంతో, హత్య చేసిన విషయం అక్కడ చెబుతుందేమోనని నేడు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సుకన్య నా భర్తను చంపి పూడ్చిపెట్టినానని చెప్పి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
తాజావార్తలు
-
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్పై ఆసక్తికర విశ్లేషణ!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!