Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి తమీమ్, ఆర్పియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వీరి సంసార జీవితంలోకి మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చాడు. అతనితో హసీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన హేసేన్.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. గ్రామ పెద్దలు మహబూబ్ బాషాను మందలించి, గ్రామం నుంచి హుసేనాపురం పంపించారు.
Also Read
అయినా.. హసీనా, మహబూబ్బాషాల తీరు మారలేదు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన హుసేన్.. భార్యను వేధించాడు. దీంతో, భర్తను అడ్డు తొలగించుకోవాలని హసీనా నిర్ణయించుకుంది. తన తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్బాషాతో కలసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల్ని తన తల్లి ఇంటికి పంపించింది. గత నెల 13వ తేదీన హుసేన్ ఇస్తమాకు వెళ్లి, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటిపైన ఇద్రూస్, మహబూబ్ బాషా ఉన్నారు. హుసేన్ నిద్రలోకి జారుకోగా.. ముగ్గురు కలిసి అతని గొంతునొక్కి చంపేశారు.
ఆ తర్వాత అనుమానం రాకుండా హుసేన్ ఆస్తమాతో ఊపిరాడక చనిపోయాడని హసీనా సమాచారం ఇచ్చింది. వైద్యులు కూడా అతడు ఊపిరాడక పోవడం వల్లే చనిపోయాడని ధృవీకరించారు. అయితే.. తన అన్నకు ఆస్తమా ఉన్నా, మందులు సక్రమంగా వాడుతున్నాడని, ఆ సమస్యతో అతను చనిపోలేదని, ఇతర కారణాలున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక మేరకు దర్యాప్తు చేయగా, తమ్ముడు & ప్రియుడతో కలిసి భార్యే హుసేన్ను చంపినట్టు తేల్చారు.

తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!