భర్తపై అనుమానం.. అతిదారుణంగా యువతి ప్రైవేట్ భాగంలో రాడ్ దింపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి పిలిచి ఆమె వద్దకు నలుగురు అబ్బాయిలను పంపి అత్యాచారానికి ఉసిగొల్పింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తించి మహిళ అన్న మాటకే మాయని మచ్చగా మారింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంకు చెందిన శ్రీకాంత్, గాయత్రి భార్యాభర్తలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి పరిసర ప్రాంతంలోని ఒక కాలనీలో నివాసముంటున్నారు.. పెళ్లైన దగ్గరనుంచి అన్యోన్యంగా ఉండే ఈ జంట అంటే కాలనీలో అందరికి మంచి పేరు ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఒక యువతి ఆ కాలనిలో అడుగుపెట్టింది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఆమె.. శ్రీకాంత్ కు పరిచయమయ్యింది. అప్పుడప్పుడు రోడ్డు మీద వీరు మాట్లాడుకునేవారు. ఇక వీరిద్దరిని గాయత్రీ చూడడం, భర్తపై అనుమానం పెంచుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక దీంతో భర్తను తన వలలో వేసుకున్న యువతిపై గాయత్రీ కక్ష కట్టింది. ఎలాగైనా ఆమెను భర్త నుంచి వేరుచేయాలని ప్లాన్ వేసింది. ఇటీవలే ఆమెను ఎంతో ఆప్యాయంగా ఇంటికి రమ్మని పిలిచింది. గాయత్రీ ప్లాన్ తెలియని యువతి ఆప్యాయంగా పిలిచిందని ఆమెతో పాటు వెళ్ళింది. అంతే.. ఆ యువతి లోపలి రావడంతో గాయత్రీ.. ఆమె కాళ్ళు చేతులు కట్టి ఒక మూలాన పడేసింది. ఆమె దగ్గరకు నాలుగు యువకులను పంపి అత్యాచారం చేయించడానికి ప్రయత్నించింది. తన భర్తతోనే సంబంధం పెట్టుకుంటావా అని యువతి బట్టలు విప్పి ఆమె ప్రైవేట్ భాగంలో యువకుల చేత పదునైన ఆయుధాలతో, రాడ్ దింపి గాయాలు చేయించింది.. ఆ ఘటనను అంతా వీడియో తీసి.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేస్తానని బెదిరించి బయటికి గెంటేసింది. ఇక ఆ గాయాలతో యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి తో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని పోలీసులు తెలుపుతున్నారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!