Crime News: ఛీఛీ.. నువ్వసలు ఆడదానివేనా.. వ్యభిచారం వద్దన్నాడని భర్తను క్రూరంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మహిళలను దేవతలతో పోలుస్తూ ఉంటారు. వారి ఓర్పుకు, సహనానికి దండం పెడతారు. భూమాతకన్నా గొప్ప సహనం ఆడదానికి మాత్రమే సొంతమని చెప్తారు. కానీ.. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు.. మహిళా జాతికే మాయని మచ్చగా మారుతున్నారు. డబ్బుకోసం కొందరు.. శృంగారం కొస్తుండం కొందరు.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. ఎదుటువారు చెప్పేది మన మంచికే అన్న ఇంగితం కూడా లేకుండా కోపోద్రేకంలో సొంతవారిని మట్టుబెడుతున్నారు. ఇక్కడ మనం చెప్పుకొనే మహిళ కథ వింటే.. ఛీఛీ.. నువ్వసలు ఆడదానివేనా అని అనేక మానరు. వ్యభిచారం వద్దు అన్నందుకు సొంత భర్తను కడతేర్చింది ఒక కసాయి. అక్కడితో ఆగకుండా మహానటి నాటకాలు ఆడింది. తన భర్తను ఎవరో చంపారు అని కల్లబొల్లి ఏడుపు పోలీసుల వద్ద కార్చింది. ఇక ఆ ఓవర్ యాక్షన్ ఆమెను పట్టించేసింది. ప్రస్తుతం కటకటాల వెనుక ఊచలు లెక్కిస్తోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జీడిమెట్ల పియస్ పరిధి సంజయ్ గాంధీ నగర్ కు చెందిన కవిడెదేవి సురేష్, రేణుక భార్యాభర్తలు. సురేష్ ఆటో డ్రైవర్. కొంత కాలంగా రేణుక వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ విషయమై భర్త సురేష్ అనేకసార్లు గొడవపడ్డాడు. అది మంచి పని కాదని, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నామని బతిమిలాడాడు. అయినా రేణుక మాట వినలేదు. ఇక దీంతో సురేష్ ఎదురుతిరిగి భార్య బాగోతం అందరికి చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో ఎక్కడ వ్యాపారం ఆగిపోతుందో అని సొంత భర్తను చంపడానికి ప్లాన్ వేసింది రేణుక. పధకం ప్రకారం సురేష్ కు ఆదివారం రాత్రి మద్యం తాగించి, తాను కూడా తాగింది. మద్యం మత్తులో తూలుతున్న సురేష్ మెడకు తన స్నేహితురాలు దేవి సాయంతో చున్నీ చుట్టి ఇద్దరు కలిసి హత్యచేశారు. ఇక భర్తను హత్య చేశాక పోలీసుల వద్దకు వెళ్లి యాక్టింగ్ మొదలుపెట్టింది. తన భర్తను ఎవరో చంపి ప్లాస్టిక్ సంచిలో పెట్టి వెల్లిపోయారని కట్టుకధ అల్లి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడానికి ప్రయత్నించగా తన భర్త మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయొద్దని ఓవర్ యాక్షన్ చేసింది. ఇక అమ్మగారి ఓవర్ యాక్షన్ కు అనుమానం వచ్చిన పోలీసులు నాలుగు తగిలించగానే నిజం మొత్తం కక్కేసింది. తన స్నేహితురాలు దేవి సాయంతో తన భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
- Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్పై నర్సు సంచలన ఆరోపణ
తాజావార్తలు
-
Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
-
Mediterranean Diet vs Indian Diet: భారతీయ ఆహారాన్ని మార్చాల్సిన అవసరముందా..? డైట్పై వైద్యుల కీలక సూచనలు
-
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
-
Istamart CEO: ఇన్స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
-
Earthquake: జపాన్లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!