Vijayawada Horror: విజయవాడలో దారుణం: వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికిన అక్క కొడుకు
- విజయవాడ ఊర్మిళనగర్లో ఘోర దారుణం..
- పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన అక్క కొడుకు..
- భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని పగ..
- మైనర్ అయిన తన కొడుకుతో కలిసి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Horror: విజయవాడ ఉర్మిళ నగర్లో ఘోర దారుణ సంఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలి సొంత అక్క కుమారుడు ముక్కలు ముక్కలుగా నరికినట్లు సమాచారం. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా వృద్ధురాలు కనబడలేదని భవానీపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.
Read Also: Evergreen Club 80 : 80స్ రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
వివరాల్లోకి వెళితే.. భవానీపురం ఊర్మిళనగర్ లో వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భర్తభార్యలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వెళ్లిపోవడానికి కారణం పిన్నినే అని తెలుసుకొని ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఇక, ఆమెను హత్య చేయాలనీ నిర్ణయించుకున్నాడు.. దీని కోసం పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.. అక్టోబర్ 1వ తేదీన మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకొని తన ఇంటికి పిన్నీని తీసుకు వెళ్ళాడు.. అప్పటికే హత్య చేయడానికి సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధలతో వరసకు పిన్ని అయినా వృద్ధురాలిని తన మైనర్ కొడుకుతో కలిసి దాడి చేసి చంపేశాడు.
Read Also: Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
ఇక, ఆ వృద్ధురాలి తల, కాళ్లు, చేతులు నరికి విజయవాడలోని అక్కనిసన్ స్కూల్ సమీపంలో నిందితులు పడేశారు. అనంతరం మొండాన్ని విజయవాడ బొమ్మసాని నగర్ లో పడేశారు. ఆ తర్వాత నంద్యాలకు పరారయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి శరీర భాగాలను సేకరించారు.. కానీ, కాళ్లు మాత్రం లభించలేదని సమాచారం. హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!