Illicit Relationship: సభ్య సమాజం తలదించుకునేలా, ఇలా కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని నోరెళ్ల పెట్టేలా ఓ వ్యక్తి, ఓ మహిళ అనైతిక సంబంధం పెట్టుకున్నారు. ఏకంగా కూతురి అత్తగారితో లవ్ లో పడ్డాడు ఓ వ్యక్తి. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో తనువు చాలించారు. నడి వయస్కులైన ఈ జంట చివరకు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్కి చెందిన 44 ఏళ్ల రామ్ నివాస్ రాథోడ్ భార్య చనిపోయింది. అతనికి ఒక కుమార్తె ఉంది. తన కూతురిని ఆశారాణి అనే మహిళ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని మేలో నిర్ణయానికి వచ్చారు. ఆశారాణికి అప్పటికే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..!
ఆశారాణి కొడుకుతో తన కుమార్తె వివాహం ఫిక్స్ కావడంతో రామ్ నివాస్ తరుచుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆశారాణితో ప్రేమలో పడ్డాడు. సెప్టెంబర్ 23న రామ్ నివాస్, ఆశారాణి ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు వీరిద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ వ్యవహారంలో వీరిద్దరి తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక సంబంధం గురించి తెలిసి వారంతా వ్యతిరేకించారు.
బంధువుల నుంచి వ్యతిరేకత రావడం, పోలీసులు వెతుకుతుండటంతో ఇద్దరు మనస్తాపంతో తమ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమను వదులుకోలేక ఇద్దరూ ప్యాసింజర్ రైలు కింద పడి చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.